జగన్ డబుల్ గేమ్ ప్రచారం..! వైసీపీ క్లారిటీ ఇదే..!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం అంతకంతకూ పెరుగుతోంది. ఇదే క్రమంలో నిన్న ఓ అంశానికి సంబంధించి ఇలాగే తీవ్ర ప్రచారం జరిగింది. వైసీపీ అధినేత జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారనేది ఆ ప్రచారం సారాంశం. దీనిపై వైసీపీ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. అసలేం జరిగిందో వివరిస్తూ సాక్ష్యాన్ని సైతం బయటపెట్టింది.
అసలు విషయానికొస్తే.. కేంద్రం వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. తొలుత లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న కేంద్రం.. ఆ తర్వాత తాజాగా రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించుకుంది. అయితే లోక్ సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ ఎంపీలకు విప్ జారీ చేసి ఓటు వేసిన వైసీపీ.. రాజ్యసభకు వచ్చే సరికి మాత్రం విప్ జారీ చేయలేదన్న ప్రచారాన్ని కూటమి పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో తీవ్రంగా చేసారు. జగన్ డబుల్ గేమ్ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

దీంతో వైసీపీ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో తమ ఎంపీలకు పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి జారీ చేసిన విప్ ను బయటపెట్టింది. ఇందులో కేంద్రం తెస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో స్పందించాలని, ఓటింగ్ వేయాలని పార్టీ ఎంపీలను వైవీ సుబ్బారెడ్డి కోరారు. దీంతో వైసీపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేయలేదన్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.
2025 వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేయలేదని ఒక వర్గం మీడియా, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ వ్యాపింపజేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ సభ్యులందరూ సభలో హాజరు కావాలని, వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశిస్తూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ స్పష్టమైన, అధికారిక విప్ జారీ చేసిందని స్పష్టం చేసింది.
YSRCP MP Shri YV Subba Reddy strongly opposes Waqf Bill in Rajya Sabha
— YSR Congress Party (@YSRCParty) April 3, 2025
New Delhi, April 3: YSR Congress Party MP Y. V. Subba Reddy strongly opposed the Waqf Amendment Bill 2025 during the Rajya Sabha debate, saying it threatens the constitutional rights and religious freedoms of… pic.twitter.com/H8RvoDKQse
ప్రజలను తప్పుదారి పట్టించడానికి లేదా వాస్తవాలను వక్రీకరించడానికి చేసే ప్రయత్నాల వెనుక రాజకీయం ఉందని, దీన్ని ఖండిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. వైసీపీ లౌకిక విలువలకు తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింి. అలాగే నిరాధారమైన ఊహాగానాలను ప్రసారం చేసే ముందు వాస్తవాలను ధృవీకరించాలని మీడియా సంస్థల్ని కోరింది.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications