గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ళనానికి ఎంఏల్ సి టిక్కెట్లు, పిడిఎఫ్ కు జగన్ మద్దతు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ ఏ కోటా ఎంఏల్ సి అభ్యర్థులను ప్రకటించింది. ఆళ్ళనాని, గంగుల ప్రభాకర్ రెడ్డిని తన అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. మూడు నియోజకవర్గాల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతివ్వాలన
హైదరాబాద్:ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంఏల్ఏ కోటా ఎంఏల్ సి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఈ మేరకు ఆళ్ళనాని, గంగుల ప్రభాకర్ రెడ్డిని ఎం ఏల్ సి ఎన్నికల్లో రంగంలోకి దించనున్నట్టు ప్రకటించింది.మూడు నియోజకవర్గాల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతివ్వాలని జగన్ పార్టీ నిర్ణయం తీసుకొంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంఏల్ఏ కోటా ఎంఏల్ సి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత జగన్ సీనియర్లతో విస్తృతంగా చర్చించారు.
ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్ళనానిని రంగంలోకి దించారు. రాయలసీమ నుండి ఇటీవలే టిడిపిని వీడి వైసిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డిని బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించింది.

మరో వైపు పిడిఎఫ్ ఎంఏల్ సి లు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వర్ రావు తదితరులు గురువారం నాడు జగన్ ను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. పట్టభద్రులు, టీచర్ ఎంఏల్ సి ఎన్నికల్లో పిడిఎఫ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.
అలాగే రాయలసీమ ఈస్ట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పిడిఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాస్ రెడ్డి , టీచర్స్ నియోజకవర్గంలో విటపు బాలసుబ్రమణ్యానికి వైఎస్ జగన్ మద్దతు తెలిపారు.
ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో అజయ్ శర్మకు మద్దతు ప్రకటించింది వైసిపి.ఈ మూడు నియోజకవర్గాల్లో పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జగన్ ఆ పార్టీ శ్రేణులను కోరారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications