నుజ్జనుజ్జయిన వైసీపీ నేత కారు: గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో.. తప్పిన పెనుముప్పు!
హైవేపై ఉన్న డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపై వస్తున్న మరో కారును ఢీకొట్టింది.ఈ ఘటనలో సుధీర్ రెడ్డి కారు ముందు భాగం నుజ్జనుజ్జయిపోయింది.
కడప: జమ్మలమడుగు వైసీపీ ఇన్చార్జి సుధీర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఎర్రగుంట్ల సమీపంలోని దొరపల్లి వంతెన వద్ద కారు పంక్చర్ అవడంతో.. ఒక్కసారిగా అదుపు తప్పింది. హైవేపై ఉన్న డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపై వస్తున్న మరో కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో సుధీర్ రెడ్డి కారు ముందు భాగం నుజ్జనుజ్జయిపోయింది. సుధీర్ రెడ్డితో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో.. జమ్మలమడుగు నుంచి గుత్తి మీదుగా సుధీర్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే.. సుధీర్ రెడ్డి సహా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాద బాధితుల్లో ఒకరైన సురేంద్రనాథ్ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ జయశేఖర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సుధీర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైందన్న వార్త వినగానే వైసీపీ కార్యకర్తలు,నేతలు పెద్ద ఎత్తున కర్నూలు తరలివెళ్లారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెను ప్రమాదం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications