జగన్ పార్టీ ఒక్కటే ఉంది: ధర్మాన, కాంగ్రెస్పై ఆగ్రహం
కాగా, ధర్మాన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెసు పార్టీలో ఎన్నాళ్లుంటానో చెప్పేలనని, రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగలేనని, అసెంబ్లీలో సమైక్యవాణి వినిపించిన తర్వాత పార్టీ నుంచి వైదొలుగుతానని ధర్మాన చెప్పారట.
కాంగ్రెసు పార్టీని వీడాలనుకుంటున్నట్లుగా వారికి చెప్పారట. అందరూ సహకరించాలని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటానో కూడా చెప్పలేనని వారితో అన్నారట. సమైక్యాంధ్ర కోసం తన నిర్ణయాన్ని సమర్థించాలని ధర్మాన కోరగా, మెజార్టీ సర్పంచులు ఆమోదం కూడా తెలిపారట.
ధర్మాన నవంబర్ నెలలోనే పార్టీలో చేరుతారని అందరూ భావించారు. అయితే విభజన తదితర కారణాల వల్ల డిసెంబర్ నెలలో చేరాలని వాయిదా వేసుకున్నారట. తాజాగా తనను కాంగ్రెసు ముద్దాయిని చేసిందని, టిడిపి పైన మొదటి నుండి పోరాడుతున్నానని, తనకు జగన్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయమని చెప్పడం గమనార్హం.