ఐవీఆర్ఎస్ కాల్స్ తో టార్చర్...! డీజీపీ వద్దకు జోగి రమేష్..!
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తాజాగా బయటపడిన కల్తీ మద్యం దందాపై ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే.. మరోవైపు రాజకీయ ప్రకంపనలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో ఇద్దరు టీడీపీ నేతల్ని చంద్రబాబు పార్టీీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వైసీపీ దీన్ని రాజకీయ అస్త్రంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో వైసీపీ నేత జోగి రమేష్ తో కల్తీ మద్యం కేసు నిందితులకు ఉన్న బంధాన్ని నిరూపించేందుకు టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా జోగి రమేష్ కూ కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావుకూ మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తూ ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు కాల్స్ చేయిస్తోంది. ఇందులో ప్రధానంగా జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ జోగి రమేష్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఓవైపు కల్తీ మద్యం కేసు దర్యాప్తు జరుగుతుంటే.. మరోవైపు ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇదే అంశంపై జోగి రమేష్ ఇవాళ ఇతర వైసీపీ నేతలతో కలిసి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఉన్న ఏడీజీకి ఫిర్యాదు చేశారు. నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కూటమి పెద్దలు కుట్రపూరితంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తమపై విష ప్రచారం నిర్వహించారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్కు తెగబడ్డారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారన్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమే ధ్యేయంగా ఎల్లో మీడియాలో అడ్డగోలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఆధారాలు చూపించకుండా వారం రోజులుగా విషప్రచారం చేసి నా వ్యక్తిత్వ హననం చేస్తున్నట్లు ఆరోపించారు. వైయస్సార్సీపీ మీద బురదజల్లడమే లక్ష్యంగా చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ పై విచారణ జరిపించి దాని వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాలన్నారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైయస్సార్సీపీ తరఫున డిమాండ్ చేశారు. అలాగే సీబీఐతో కూడా దర్యాప్తు చేయించాలన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications