జైఆంధ్ర ఉద్యమ నేత విగ్రహం తొలగింపు, బెజవాడలో ఉద్రిక్తత, యలమంచిలి రవి అరెస్ట్
అమరావతి: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి వైసీపీ నేత యలమంచిలి రవి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు ప్రొక్లెయినర్ని అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు యలమంచిలి రవిని అరెస్టు చేశారు.

అనంతరం భారీ బందోబస్తు మధ్య కాకాని విగ్రహాన్ని తొలగించారు. బ్రిడ్జి, అభివృద్ధి పనుల కోసం ఈ విగ్రహాన్ని అధికారులు తొలగించారు.
విగ్రహం తొలగింపుపై యలమంచిలి మాట్లాడుతూ.. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. విగ్రహం తొలగింపుపై ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, మరీ అర్ధరాత్రి తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు తనను బలంతంగా అరెస్టు చేశారన్నారు. అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా దొంగతనంగా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు.
విగ్రహం తరలింపుపై యలమంచిలి రవితో పాటు వంగవీటి రాధాకృష్ణ కూడా నిరసన తెలిపారు. అర్ధరాత్రి సమయంలో విగ్రహం తొలగింపు సరికాదని వంగవీటి అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications