వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న గోల్ఫ్, నేడు చెస్: విదేశీ పర్యనటలో జగన్‌ కాలక్షేపం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కుటుంబ సభ్యులతో బ్రిటన్ పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత వైయస్ జగన్ రాజకీయ ఒత్తిడి నుంచి బాగానే సేద తీరుతున్నట్లుగా కనిపిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) పర్యటనలో ఉన్న జగన్ ప్రస్తుతం ఐర్లాండ్ చేరుకున్నారు. విదేశీ పర్యనటలో ఆయన చెస్, గోల్ఫ్ ఆటలతో సరదాగా గడుపుతున్నారు.

కుటుంబంతో విదేశీ పర్యటనకు జగన్: సీనియర్లకు పగ్గాలు, సరైన నిర్ణయమేనా?

మొన్న ఎడింబర్గ్‌లోని సువిశాల పచ్చిక బయళ్లలో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన జగన్... తాజాగా చెస్ ఆడుతూ ఉన్న ఫోటోలను శనివారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. చెస్ బోర్డు ముందు కూర్చున్న జగన్ ఏ ఎత్తు వేయాలనే ఆలోచిస్తూ ఆ ఫోటోల్లో దర్శనమిస్తోంది.

'మంచి ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. చెస్ ఎలా ఆడాలో నాకు నేర్పించి, తనతో ఆడిన తాతకు థాంక్స్' అంటూ ఫోటోల కింద రాశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 16వ తేదీన విదేశీ పర్యనటకు బయల్దేరిన జగన్ మరో రెండు రోజుల్లో తన విదేశీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

English summary
Ysrcp president ys jagan playing chess at his foreign visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X