పులివెందుల, ఒంటిమిట్టపై సుప్రీంకు..! వైసీపీ కీలక నిర్ణయం..!
ఏపీలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కూ, కౌంటింగ్ కూ మధ్య ఓట్ల తేడాపై ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై మరో పోరాటనికి సిద్దమవుతోంది. ఓవైపు బీహార్ లో ఓటర్ల జాబితాల సవరణపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుండటం, సుప్రీంకోర్టు ఈసీపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యవస్థలన్నీ యాంత్రికంగా తయారైన పరిస్థితి కనిపిస్తోందని, రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు మనం జవాబుదారీతనంతో ఉండాలన్నారు. వారికి మనమిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు.

యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం ఈవీఎంల విషయంలో దేశంలో బలపడిందని సజ్జల తెలిపారు.
ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలకు సమాధానం ఉండటం లేదన్నారు. మన రాష్ట్రంలోనే ఓటింగ్ నిర్వహించిన విధానంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని, ఓటింగ్ పూర్తయిన రోజు ప్రకటించిన ఎన్నికల శాతానికి, తుది వివరాలు ఇచ్చిన దానికి ఓటింగ్ శాతంలో 12.5 శాతం తేడా ఉందని గుర్తుచేశారు. దాదాపు 50 లక్షలకు పైగా ఓట్లు తేడా ఉన్నాయని అడుగుతుంటే సమాధానం చెప్పే వ్యవస్థ లేదన్నారు.
ఎన్నికల అరాచకాలపై తాము కోర్టు మెట్లెక్కితే ఆధారాలు తీసుకురావాలని కోరుతుందేమో అనుకున్నామని, కానీ దురదృష్టవశాత్తు అదీ జరగలేదన్నారు. అయినా న్యాయ వ్యవస్థమీద పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందన్నారు. అవసరమైతే తాము కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెబుతున్నామన్నారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలోనూ పెద్ద మనుషులుగా ఎవరు ముందుకొచ్చినా నిలబడటానికి తాము రెడీ అని, సీనియర్ జర్నలిస్టులు కావొచ్చు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావొచ్చు సామాజిక స్పృహ ఉన్నవారు, న్యూట్రల్ గా ఉన్న ఎవరైనా కావొచ్చన్నారు. ఎలాగూ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వరు కాబట్టి 15 బూత్లు ఉన్న ఊర్లలోకి నేరుగా వెళ్లాలని, ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడాలన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications