పోలీస్ ఇన్ ఫార్మర్ పేరుతో వీళ్లు ఏం చేస్తున్నారంటే ?, కొంచెం తేడా వస్తే అంతేగతి!
బెంగళూరు: బెంగళూరులోని వివిధ కాలేజీలు, క్లబ్బులు, పబ్లలో గంజాయి వినియోగం విరివిగా జరుగుతోందని చాలాకాలం నుంచి ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇలా డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించేందుకు నియమించిన పోలీసు ఇన్ఫార్మర్లు గంజాయి తాగడమే కాకుండా నిందితుల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నారు. విద్యార్థులను పోలీసు ఇన్ ఫార్మర్లు పట్టుకుని డబ్బు వసూలు చేశారు.
కర్ణాకటలో డ్రగ్స్, గంజాయి విక్రయాల నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలిస్తామని ఆ రాష్ట్ర హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. దీనికి తోడు డ్రగ్స్ నెట్వర్క్ను నియంత్రించేందుకు బెంగళూరు నగర పోలీసులు కొంతమందిని ఇన్ఫార్మర్లుగా నియమించారు. ఇలా పోలీసులు నియమించిన ఇన్ ఫార్మర్లు డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులను ఆరా తీసి వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నారు.ఒకే కేసులో 1.70 లక్షలు రికవరీ అయింది.

పోలీసులకు సమాచారం అందించడంతో వారు పోలీసుల తరహాలో దోపిడీకి పాల్పడ్డారు. పలు కేసుల్లో పోలీసులకు సమాచారం ఇచ్చే నిందితులు ఇటీవల కొందరు ధనవంతులైన కుర్రాళ్లను చూసి తామే డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. డ్రగ్స్, గంజాయి సేవిస్తూ ఇరుక్కుపోయిన విద్యార్థులను విచారించి పోలీసుల తరహాలోనే పోలీసు ఇన్ ఫార్మర్లు వారిని బెదిరించారు.
దీన్ని పెట్టుబడిగా చేసుకుని ఓ విద్యార్థిని కారులో ఎక్కించుకుని బెంగళూరులోని వివిధ రోడ్లలో తిప్పి డబ్బులు దండుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. విద్యార్థి నుంచి రూ. 1.70 లక్షలు డబ్బులు వారి ఖాతాలో వేసుకున్నారని వెలుగు చూసింది. విషయం బయటకు చెబితే చంపేస్తామని నిందితులు ఆ విద్యార్థిని బెదిరించారు.
విచారణలో ఇదే తరహాలో 15 మందికి పైగా విద్యార్థుల నుంచి బలవంతపు వసూళ్లు చేశారని వెలుగు చూసింది. సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్టు చేసిన నిందితులను రాకేష్, అరుణ్, హరీష్లుగా గుర్తించారు. చాలా నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు కేసులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
దీనిపై మీడియాతో మాట్లాడిన డీసీపీ శ్రీనివాస్ గౌడ్ తన వద్ద గంజాయి కేసుల సమాచారం ఉందని, పోలీసులకు పలుమార్లు సమాచారం ఇచ్చానని, ఇన్ఫార్మర్గా ఉన్నానని చెప్పి నిందితులు డబ్బులు వసూలు చేశారని ఆయన చెప్పారు. తర్వాత డబ్బు సంపాదించేందుకు పోలీసులలాగా ఎంట్రీ ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారని, తాము పోలీసులమని చెప్పి మోసం చేశారని డీసీపీ వివరించారు.
విచారణలో 25 కంటే ఎక్కువ చర్యలకు ఈ ముగ్గురు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. సదాశివ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులు విద్యార్థినిని టార్గెట్ చేశారు. అతడిని హాస్టల్ నుంచి బయటకు పిలిచి ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లారు. తర్వాత గంజాయి కేసులో నీ పేరు కూడా ఉందంటూ బెదిరించారు. వైద్యపరీక్ష చేయించినట్లు చెప్పి బెదిరించి లక్ష రుపాయలకు పైగా డబ్బులు రాబట్టుకున్నారన్నారు.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications