సీఎం మార్క్ రాజకీయం, రాగిముద్ద, ఆకుకూరలు, బ్రెడ్, జామ్ ఎంట్రీ, సబ్సిడీతో డీల్!
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. పేదల ఫైవ్ స్టార్ హోటల్ ఇందిరా క్యాంటిన్ లో కొత్త మెనూ తీసుకువస్తున్నారు. జామ్, మంగళూరు బన్స్తో కూడిన రెండు బ్రెడ్లు త్వరలో ఇందిరా క్యాంటీన్ బ్రేక్ఫాస్ట్లో అందుబాటులో ఉంటాయి. మెనూలో రెండు అదనపు స్నాక్స్ జోడించబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇడ్లీ, పొంగల్, ఖరాబాత్, బిస్బేలేబాత్, వెజిటబుల్ పులావ్లకు అదనంగా ఇవి అందుబాటులో ఉంటాయి.
ఎంతో ఆర్భాటంగా ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వాటిని పునఃప్రారంభిస్తోంది. క్యాంటీన్లను పునరుద్ధరించడం, క్యాంటిన్లు విస్తరించడం మాత్రమే కాకుండా, వాటి మెనూలను కూడా పునరుద్ధరిస్తున్నారు. వచ్చేవారం జోనల్ స్థాయిలో ఇందిరా క్యాంటీన్లు నిర్వహించేందుకు, ఆహారాన్ని అందించేందుకు తాజాగా టెండర్లను ఆహ్వానించేందుకు నగర పౌరసరఫరాల సంస్థ సిద్ధమైంది.

ఇందిరా క్యాంటీన్లలో మద్యాహ్నం, రాత్రి డిన్నర్ కోసం మెనూలో రాగి ముద్ద, ఆకుకూరల చారులు ప్రవేశపెడతారు. ఇది ప్రతి రోజు అందుబాటులో ఉంటుంది. ఇతర రోజులలో చపాతీ, సాగు లేదా చపాతీ వెజ్ గ్రేవీతో అన్నం మరియు కూరగాయల సాంబార్ అందుబాటులో ఉంటుంది. వారానికి ఐదు రోజులు మాత్రమే మధ్యాహ్న భోజనానికి తీపి పదార్థాలు కూడా పరిచయం చేస్తోంది.
ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదనపై కర్ణాటకలోని అధికార పార్టీ కాంగ్రెస్ లో చర్చ జరిగింది. అయితే ఇందిరా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అలాంటి ప్రతిపాదనేమీ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉడకబెట్టిన గుడ్లను అందించడం వల్ల ఖజానాకు విపరీతమైన ఖర్చవుతుందని, దాని వలన నష్టం వస్తుందని అధికారులు సీఎం సిద్దరామయ్యకు చెప్పారని తెలిసింది.
అటువంటి ప్రతిపాదన ఏదీ అధికారికంగా చర్చించలేదని ఓ అధికారి అన్నారు. అంతేకాకుండా ఇందిరా క్యాంటీన్ల భావన జీవనాధారమైన ఆహారాన్ని అందించడం, విలాసవంతమైన ఆహారం కాదు అని సీనియర్ అధికారి చెప్పారు. ప్రజలకు భోజనం ఖర్చు అల్పాహారం కోసం రూ. 5, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి ఒక్కొక్కరికి రూ. 10 ఇచ్చేవాళ్లమని బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఇటీవల చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ఖర్చు ఒక్కొక్కరికి రూ.25 అవుతుందని తెలిపారు.

మేము రాత్రి భోజనానికి అందుబాటులో ఉన్న వస్తువుల సంఖ్యను మరియు వడ్డించే ఆహారాన్ని కూడా పెంచాలని నిర్ణయించుకున్నాము. బీబీఎంపీ ప్రజలకు చెల్లించే రూ. 25 రూపాయలకు రూ. 42 రూపాయల అదనపు సబ్సిడీని అందిస్తుందని, అయితే కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి మూడు పూటల మొత్తం ఖర్చు రూ. 67 రూపాయలుగా నిర్ణయించబడింది.
మొత్తం 175 నడుస్తున్న ఇందిరా క్యాంటీన్ల ఆర్థిక లోటుపాట్లన్నీ తీర్చి పునరుద్ధరిస్తాం అని బకాయిలు చెల్లించకపోవడంతో చాలా క్యాంటీన్లు కట్ అయ్యాయి. బెంగళూరు నగరంలో అదనపు క్యాంటీన్లను నిర్మిస్తున్నామని, మొత్తం సంఖ్య 250కి చేరుకుందని, బెంగళూరు నగరంలో ఒక వార్డుకు ఒక క్యాంటీన్ను ప్లాన్ చేశామని అధికారులు అంటున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications