డీకే శివకుమార్‌కు మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు: ఈ టైంలోనా అంటూ డీకే ఫైర్

బెంగళూరు: మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' రాక కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. ఈడీ సమన్ల సమయాన్ని ప్రశ్నించారు.

"భారత్ జోడో యాత్ర, కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల మధ్యలో, వారు మళ్లీ ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా నాకు సమన్లు ​​జారీ చేశారు. నేను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే ఈ సమన్ల సమయం.. నా రాజ్యాంగ, రాజకీయ విధులను నిర్వర్తించడానికి అడ్డంకిగా మారింది' అని మైసూర్‌లో ఉన్న శివకుమార్ గురువారం ట్వీట్ చేశారు.

ED summoned DK Shivakumar in money laundering case

కాగా, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కూడా శివకుమార్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో, ఈడీ నమోదు చేసిన 2018 మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శివకుమార్, ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో మంత్రిగా ఉన్న శివకుమార్ బెంగళూరు నుంచి ఢిల్లీకి భారీ మొత్తంలో అక్రమ, లెక్కలు చూపని నగదును సంపాదించారని, పన్ను ఎగవేత కోసం ఇతర సహ నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర పన్నారని ఆర్థిక దర్యాప్తు సంస్థ తెలిపింది.

ఆదాయపు పన్ను శాఖ 2017 ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలోని నిందితులకు చెందిన పలు ఆస్తులపై సోదాలు నిర్వహించి, లెక్కల్లో చూపని రూ.8,59,69,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+