Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Family: ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య, కూతురి పరిస్థితి ?, 9 నెలల పాప విషయంలో పోలీసులు!

కోలారు/ బెంగళూరు: చిన్నారి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కుటుంబంలోని నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కుటుంబం పరువు పోతుందని ఆవేదనతో ఒకే కుటుంబంలోని ఐదు మంది విషం సేవించారు. విషం తాగిన కుటుంబ సభ్యులు బాధ తట్టుకోలేక ఆర్తనాదాలు చేశారు. స్థానికులు విషయం గుర్తించి ఐదు మందిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తెలిసిన మహిళ ఈ కుటుంబ సభ్యులకు ఆమె కూతురు (చిన్నారి) ఇచ్చింది. అమ్మాయిని పెంచి పోషించలేని తల్లి వీరికి బిడ్డను ఇచ్చింది.

అయితే తమ చేతికి వచ్చిన ఆడ బిడ్డను వేరే మహిళకు ఈ కుటుంబ సభ్యులు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కుటుంబ సభ్యులు నిజంగా ఆ బిడ్డను విక్రయించారా ?, లేదా ? అనే విషయం ఇంకా తేలకముందే పోలీసుల వేధింపులతో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కోలారు సమీపంలో దంపతులు

కోలారు సమీపంలో దంపతులు

కర్ణాటకలోని కోలారు పట్టణం (ఆంధ్రా సరిహద్దు జిల్లా) సమీపంలోని హోన్నేనహళ్ళిలో సత్య, సుమిత్ర అనే మహిళ నివాసం ఉంటున్నారు. సత్య, సుమిత్ర దంపతులకు 9 నెలల కూతురు ఉంది. సత్యకు కోలారులోని గల్ పేట్ లోని కారంజికట్టలో నివాసం ఉంటున్న పుష్పా (38) అనే మహిళ పరిచయం ఉంది.

పుష్పా ఫ్యామిలీ

పుష్పా ఫ్యామిలీ

కోలారులోని కారంజికట్టలో పుష్పా తల్లిదండ్రులు మునేశప్ప (70), నారాయణమ్మ (65) నివాసం ఉంటున్నారు. పుష్పా భర్త బాబు (45), కుమార్తె గంగోత్రి (17) కూడా మునేశప్ప, నారాయణమ్మ దంపతులతో పాటు నివాసం ఉంటున్నారు. సుమిత్ర దగ్గర 9 నెలల పాపను తీసుకు వెళ్లిన తరువాత పుష్పా కొన్ని రోజులు వారి దగ్గరే పెట్టుకుందని తెలిసింది.

పాపను విక్రయించారా?

పాపను విక్రయించారా?

సుమిత్ర ఇచ్చిన 9 నెలల పాపను కొన్ని రోజులు తన దగ్గరే పెట్టుకున్న పుష్పా తరువాత వేరే దంపతులకు ఆ అమ్మాయిని విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత సుమిత్రాకు విషయం తెలిసిం పుష్పా దగ్గరకు వెళ్లింది. నా బిడ్డ ఎక్కడుంది ? అని సుమిత్రా ప్రశ్నించింది. పుష్పా నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది.

కిడ్నాప్ కేసు నమోదు

కిడ్నాప్ కేసు నమోదు

కూతురి ఆచూకి చెప్పకోవడంతో రగిలిపోయిన సుమిత్రా వెంటనే కోలారు మహిళా పోలీస్ స్టేషన్ లో పుష్పా మీద బాలికను కిడ్నాప్ చేశారని కేసు పెట్టింది. పోలీసులు పుష్పాను, ఆమె భర్త బాబు, తల్లిదండ్రులు మునేశప్ప, నారాయణమ్మను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. నాలుగు రోజులు బిడ్డను అప్పగించకపోతే మీమీద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారని తెలిసింది.

పరువు పోతుందని భయపడి ఆత్మహత్య

పరువు పోతుందని భయపడి ఆత్మహత్య

పోలీసులు పిలిపించి వార్నింగ్ ఇచ్చి కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో పుష్పా కుటుంబ సభ్యులు భయపడిపోయారు. కుటుంబం పరువు పోతుందని ఆవేదనతో నారాయణమ్మ, మునేశప్ప, పుష్పా, ఆమె భర్త బాబు, కూతురు గంగోత్రి ఐదు మంది విషం సేవించారు. విషం తాగిన కుటుంబ సభ్యులు బాధ తట్టుకోలేక ఆర్తనాదాలు చేశారు.

స్థానికులు విషయం గుర్తించి ఐదు మందిని కోలారులోని ఆర్ ఎల్ జాలప్ప ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం రాత్రి నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Recommended Video

    Hardik Pandya సూపర్ హీరోస్.. Rohit, Kohli కి నో ఛాన్స్ ! || Oneindia Telugu
    ఏదీ తేలకముందే ఒకే ఫ్యామిలీలో నలుగురి ఆత్మహత్య

    ఏదీ తేలకముందే ఒకే ఫ్యామిలీలో నలుగురి ఆత్మహత్య

    9 నెలల అమ్మాయిని పెంచి పోషించలేని సావిత్రి పరిచయం ఉన్న పుష్పాకు బిడ్డను ఇచ్చింది. అయితే తమ చేతికి వచ్చిన ఆడ బిడ్డను పుష్పా ఆమెకు పరిచయం ఉన్న గీతా అనే మహిళకు ఈ కుటుంబ సభ్యులు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కుటుంబ సభ్యులు నిజంగా ఆ బిడ్డను విక్రయించారా ?, లేదా ? అనే విషయం ఇంకా తేలకముందే పోలీసుల వేధింపులతో ఒకే కుటుంబంలో నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పుష్పా పరిస్థితి కూడా విషమంగానే ఉందని, ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నదని వైద్యులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+