Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీకు దమ్ముంటే ఆపని చెయ్యండి. చేతకాకపోతే సైలెంట్ గా ఉండండి, మాజీ సీఎం!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సొంత పార్టీని వదిలి బీజేపీలో చేరి ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరి డీసీఎం అయ్యారని, కర్ణాటకలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో బోమ్మయ్ కాంగ్రెస్‌పై ఘాటుగా విమర్శలుు చేశారు.

దావణగెరెలో బుధవారం మీడియాతో మాట్లాడిన బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఐదు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు త్వరలోనే ప్రజలు బుద్ది చెబుతారని బోమ్మయ్ అన్నారు. సభ లోపల ఒకలా, సభ బయట ఒకలా కాంగ్రెస్ మాట్లాడుతోందని బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు. ప్రజల కోసం బీజేపీ పోరాడుతుందని బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు. మరికొద్ది రోజుల్లో బీజేపీ ప్రతిపక్ష బీజేపీ నాయకుడిని ఎన్నుకుంటుందని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

Former CM Basavaraj Bommai demanded that all the cases should be investigated if the Congress has guts

వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రంలోని బీజేపీ నేతలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడి ఎన్నిక ఆలస్యమైందని, ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర బీజేపీపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. స్కాంలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సమాధానమిచ్చారు. బీజేపీది 40 శాతం కమీషన్ అని ఆరోపించిన ఈ ప్రభుత్వం ఆ స్కామ్ పై విచారణ జరిపించాలన్నారు. దానితో పాటు ఇప్పటికే లోకాయుక్తలో ఉన్న అన్ని కేసులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

2013 నుంచి 2023 వరకు వచ్చిన అన్ని కేసులను లోకాయుక్త ముందు అప్పగించాలి. ఏ కేసు ఆధారంగా దర్యాప్తు జరపరాదని బసవరాజ్ బొమ్మయి డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా అవినీతి వ్యతిరేకి అయితే, మార్చి 2013 నుండి మార్చి 2023 వరకు జరిగిన అన్ని స్కామ్ ల కేసులను దర్యాప్తు చేయాలి.

కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక అంశాన్ని విచారించడం సరికాదని, అన్ని కేసులను విచారించి దోషులందరినీ శిక్షించాలని మాజీ సీఎం బసవరాజో బోమ్మయ్ డిమాండ్‌ చేశారు. కమీషన్ ఆరోపణలు చేసిన రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్నపై బీజేపీ మాజీ మంత్రి మునిరత్న పరువునష్టం కేసు వేశారని, ఆ కేసు విచారణ కూడా జరగాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+