Girls: అర్దరాత్రి పబ్ లో పీకలదాక తాగేసిన కాలేజ్ అమ్మాయిలు, పోలీసుల మీద దాడి, ఆఫ్రికా లేడీస్ దెబ్బతో, ఢమాల్!
బెంగళూరు: ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాల నుంచి బెంగళూరు వచ్చిన అమ్మాయిలు అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. యువతులు నివాసం ఉంటున్న ఇంటికి అమ్మాయిల మగ స్నేహితులతో పాటు అమ్మాయిలు ఎక్కువగా వెళ్లి వస్తున్నారు. కాలేజ్ సమయంలో ఆ అమ్మాయిలు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. అర్దరాత్రి పబ్ లో ముగ్గురు అమ్మాయిలతో పాటు కొందరు పీకలదాక మద్యం సేవించారు. అర్దరాత్రి వరకు పబ్ లో అమ్మాయిలు ఎంజాయ్ చేశారు.
అర్దరాత్రి పోలీసులు ఎంట్రీతో సీన్ మారిపోయింది. అర్దరాత్రి దాటినా మీరు ఎందుకు ఇంటికి వెళ్లడం లేదని పోలీసులు ప్రశ్నించారు. చూడటానికి బలంగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు రెచ్చిపోయి పోలీసుల మీద పిడిగుద్దులతో దాడి చేశారు. అడ్డుపడిన ప్రజల మీద చిందులు వేసిన విదేశీ అమ్మాయిలు అర్దరాత్రి సినిమా చూపించారు.

ఆఫ్రికా అమ్మాయిలు
ఆఫ్రికాకు చెందిన పీస్ పర్నాస్, జ్యూలియా వెంజిరో అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నత విద్యాభ్యాసం చెయ్యడానికి విదేశాల నుంచి బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని కమ్మనహళ్లిలో ఆఫ్రికాకు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలతో పాటు అదే దేశానికి చెందిన కొందరు అమ్మాయిలు నివాసం ఉంటున్నారు.

బ్రిగేడ్ రోడ్డు పబ్ లో ఎంజాయ్
ఆఫ్రికా యువతులు నివాసం ఉంటున్న కమ్మనహళ్ళిలోని వాళ్ల ఇంటికి వాళ్ల మగ స్నేహితులతో పాటు కొందరు అమ్మాయిలు ఎక్కువగా వెళ్లి వస్తున్నారు. రాత్రి పీస్ పర్నాస్, జ్యూలియా వెంజిరో తో పాటు మరో ఆఫ్రికా అమ్మాయి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డులోని ఓ ఫేమస్ పబ్ లోకి వెళ్లారు. అప్పటికే అక్కడున్న కొందరు స్నేహితుతో కలిసి ముగ్గురు ఆఫ్రికా అమ్మాయిలు పీకలదాక మద్యం సేవించారు.

బయటకు తోసేసిన పబ్ సిబ్బంది
అర్దరాత్రి దాటిపోయినా ఆఫ్రికా అమ్మాయిలు పబ్ లోనే ఉండిపోయారు. రాత్రి 1.30 గంటల సమయంలో మీరు ఇంటికి వెళ్లాలని పబ్ సిబ్బంది ఆఫ్రికా అమ్మాయిలకు చెప్పారు. ఆ సందర్బంలో పబ్ సిబ్బందికి, ఆఫ్రికా అమ్మాల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సందర్బంలో పబ్ సిబ్బంది అశోక్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల మీద పిడిగుద్దులతో దాడి
అర్దరాత్రి దాటిన తరువాత అశోక్ నగర్ పోలీసులు ఎంట్రీతో పబ్ దగ్గర సీన్ మొత్తం మారిపోయింది. అర్దరాత్రి దాటినా మీరు ఎందుకు ఇంటికి వెళ్లడం లేదని పోలీసులు ఆఫ్రికా అమ్మాయిలను ప్రశ్నించారు. చూడటానికి బలంగా ఉన్న ఇద్దరు ఆఫ్రికా అమ్మాయిలు రెచ్చిపోయి అశోక్ నగర్ పోలీసుల మీద పిడిగుద్దులతో దాడి చేశారు.

ఏఎస్ఐ, హెడ్ కానీస్టేబుల్ మీద దాడి
ఏఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ కు గాయాలైనాయి. ఆ సందర్బంలో అడ్డుపడిన స్థానిక ప్రజల మీద చిందులు వేసిన ఆఫ్రికా అమ్మాయిలు అర్దరాత్రి అక్కడ అందరికి ఫ్రీగా సినిమా చూపించారు. పోలీసులు, పబ్ సిబ్బంది ఫిర్యాదు చెయ్యడంతో అశోక్ నగర్ పోలీసులు ఆఫ్రికాకు చెందిన అమ్మాయిల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications