బస్సు మీద నుంచి రూ. 500 నోట్లు విసిరేసిన ట్రబుల్ షూటర్, సీఎం అభ్యర్థి ఇలా చేస్తే ఎలా?, ఝలక్!
బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో నేనే కాబోయే ఎమ్మెల్యే అంటూ కొందరు నాయకులు ధీమాగా తిరిగేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద కేసు నమోదు అయ్యింది. బస్సు మీద నుంచి రూ. 500 నోట్లు విచ్చలవిడిగా ఎగరేశారని డీకే. శివకుమార్ మీద కేసు నమోదు అయ్యింది.
కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీని ఢీకొట్టాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అధికార పార్టీ బీజేపీకి ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ప్రజాధ్వని పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు.

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో డీకే. శివకుమార్ ప్రజాధ్వని పేరుతో బస్సుయాత్ర కోనసాగించారు. ఆ సందర్బంలో ర్యాలీలో పాల్గొన్న జానపద కళాకారుల మీద డీకే. శివకుమార్ రూ. 500 నోట్లు విసిరేశారు. బస్సు మీద నుంచి ప్రజల మీదకు. జానపద కళాకారుల మీదకు డీకే. శివకుమార్ రూ. 500 నోట్లు విసిరి వేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు.
ప్రముఖ జాతీయ మీడియా ఏఎన్ఐ ఈ వీడియోను మొదట బయటపెట్టడంతో వైరల్ అయ్యింది. తరువాత కన్నడ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అడ్డదారిలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని, తానే సీఎం అంటూ ప్రచారం చేసుకుంటున్న డీకే. శివకుమార్ పబ్లిక్ గా ప్రజలకు రూ. 500 నోట్లు విసిరేస్తున్నాడని ఆరోపిస్తూ బీజేపీ ఎంఎల్ సీ, ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ మండ్య జిల్లా ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణకు ఫిర్యాదు చేశారు.
డీకే. శివకుమార్ నగదు పంచుతున్నాడని కొన్ని సాక్షాలతో సహ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని, మండ్య గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని, అధికారులు విచారణ చేస్తున్నారని మండ్య జిల్లా ఎన్నికల అధికారి గోపాలక్రిస్ణ గురువారం మీడియాకు చెప్పారు. మొత్తం మీద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఒక పార్టీ నేతల మీద మరో పార్టీ నేతలు కేసులు పెట్టుకోవడం మొదలైయ్యింది.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications