Power Star: పవర్ స్టార్ కు మాత్రమే సాధ్యం, మాటలు చాలవు, అవార్డు ఇస్తాం, సీఎం, ఫ్యాన్స్ హ్యాపి !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మన మద్య లేరని ఎవరు అంటున్నారు, కోట్లాది మంది అభిమానుల్లో పునీత్ రాజ్ కుమార్ సజీవంగానే ఉన్నారని, ఆయన భౌతికంగా మాత్రమే మన అందరికీ దూరం అయ్యారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడానికి త్వరలోనే ముహుర్తం ఖరారు చేస్తామని, కనుల పండుగగా ఆ కార్యక్రమం నిర్వహిస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు, ఓ పక్క ఆయన లేరని బాధగా ఉన్నా, అభిమానులు మాత్రం ఆయన పేరుతో సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉందని సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. జేమ్స్ సినిమా హిట్ కావాలని, పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ఇదే కావడం చాలా బాధగా ఉందని సీఎం బసవరాజ్ బొమ్మయ్ విచారం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఆయన అభిమానులు అనేక సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం బసవరాజ్ బొమ్మయ్ మనవి చేశారు. కోట్లాది మంది అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఒక్క పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కే సాధ్యం అయ్యిందని సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. పునీత్ రాజ్ కుమార్ మన మద్యలేకుండా జరుగుతున్న మొదటి పుట్టిన రోజు ఇది, పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పడానికి మాటలు చాలవని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని, ఆయన చేసిన సమాజ సేవ అలాంటిది అని సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.

దుమ్ములేపుతున్న జేమ్స్
స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ నటించిన చివరికి సినిమా జేమ్స్ కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ బాషల్లో గురువారం విడుదల అయ్యింది. మార్చి 17వ తేదీన పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు కావడంతో జేమ్స్ సినిమా చూడటానికి ఆయన అభిమానులు పోటెత్తారు. కర్ణాటకలో గురువారం వేకువ జామున నుంచే జేమ్స్ జాతర మొదలైయ్యింది.

కర్ణాటక సినీ చరిత్రలోనే మొదటిసారి
కర్ణాటకలో సర్వసాదారణంగా ఏ హీరో సినిమా అయినా ఉదయం 10.30 గంటలకు మొదటి షో మొదలౌతుంది. అయితే కర్ణాటక చరిత్రలోనే అర్దరాత్రి జేమ్స్ సినిమా మొదటి షో మొదలైయ్యింది. గురువారం వేకువ జామున నుంచి కర్ణాటక వ్యాప్తంగా వందలాది సినిమా థియేటర్లలో ఫ్యాన్స్ షోలు మొదలైనాయి. కర్ణాటక చరిత్రలో ఒక కన్నడ సినిమా మల్టీఫ్లెక్స్ ల్లో వందలాది స్క్రీన్స్ లో జేమ్స్ సినిమా ప్రదర్శించారు.

కోట్లాది మందిలో పవర్ స్టార్ సజీవంగా ఉన్నారు, సీఎం
స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మన మద్య లేరని ఎవరు అంటున్నారు, కోట్లాది మంది అభిమానుల్లో పునీత్ రాజ్ కుమార్ సజీవంగానే ఉన్నారని, ఆయన భౌతికంగా మాత్రమే మన అందరికీ దూరం అయ్యారని, ఆయన చేసిన సమాజ సేవ, సేవా కార్యక్రమాల రూపంలో అందరి మద్య సజీవంగానే ఉన్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. గురువారం బెంగళూరులో సీఎం బసవరాజ్ బొమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ గురించి ఇలా అన్నారు.

పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న, డేట్ ఫిక్స్, సీఎం బొమ్మయ్
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడానికి త్వరలోనే ముహుర్తం ఖరారు చేస్తామని, ఆ విషయంలో రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో చర్చించి ఓ డేట్ ఫిక్స్ చేస్తామని, ఆ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహిస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు, ఓ పక్క ఆయన లేరని బాధగా ఉన్నా, అభిమానులు మాత్రం ఆయన పేరుతో సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉందని సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.

పవర్ స్టార్ కు మాత్రమే సాధ్యం, సీఎం
పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ సినిమా సూపర్ హిట్ కావాలని, పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ఇదే కావడం చాలా బాధగా ఉందని సీఎం బసవరాజ్ బొమ్మయ్ విచారం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఆయన అభిమానులు అనేక సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం బసవరాజ్ బొమ్మయ్ మనవి చేశారు. కోట్లాది మంది అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఒక్క పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కే సాధ్యం అయ్యిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.
Recommended Video


పవర్ స్టార్ గురించి చెప్పడానికి మాటలు చాలవు
పునీత్ రాజ్ కుమార్ మన మద్యలేకుండా జరుగుతున్న మొదటి పుట్టిన రోజు ఇది, పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పడానికి మాటలు చాలవని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని, ఆయన చేసిన సమాజ సేవ అలాంటిది అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. ఇదే సమయంలో పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ట్వీట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications