సీఎం మీద అనర్హత వేటు వెయ్యాలని హైకోర్టును ఆశ్రయించిన శంకర్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, వరుణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధరామయ్యపై అనర్హత వేటు వేయాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే ఏడాది మే 20వ తేదీన సిద్ధరామయ్య రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం సిద్దరామయ్య మీద ఎమ్మెల్యే పదవి వేటు వెయ్యాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించకముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీలను ఇచ్చింది. అలాగే హామీ కార్డులపై కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే. శివకుమార్, సిద్ధరామయ్య సంతకాలు చేసి ఇచ్చారు. దీని ఆధారంగా కోర్టును ఆశ్రయించారు. సిద్ధరామయ్య ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు వేయాలని కోరుతూ శంకర్ అనే వ్యక్తి శుక్రవారం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జులై 28వ తేదీన కోర్టు విచారించనుంది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన 1, 19, 816 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి వి. సోమన్న ఓడించి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగల్కోట్ జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
కానీ ఈ ఎన్నికల్లో ఆయన తన నియోజకవర్గాన్ని మార్చుకుని మైసూరులోని వరుణ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సిద్ధరామయ్య శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ మే 2న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
అయితే అంతకు ముందు ఆ పార్టీ ప్రజలకు 5 హామీలు ఇచ్చింది. డీకే. శివకుమార్, సిద్ధరామయ్య సంతకాలు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 5 ఉచిత హామీల అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించారు.
స్రీశక్తి, గృహలక్ష్మి, గృహజ్యోతి సహా మూడు హామీలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, అన్నభాగ్య, శక్తి అనే 5 హామీలను ఇచ్చింది. ప్రజలు కూడా హామీలను నమ్మి కాంగ్రెస్ను ఆదరించి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications