Swamiji: మురుగా, ఎంతపని చేశావయ్యా ?, అమ్మాయిల కేసులో స్వామీజీకి, రశ్మీ మేడమ్ కు నో బెయిల్, ఢమాల్!
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలోని మురుగా మఠానికి చెందిన అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రదుర్గాకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమ్మాయిల లైంగిక దాడి కేసులో బెయిల్ తీసుకుని బయటకు రావాలని ప్రయత్నాలు చేసిన మురుగా మఠం శివమూర్తి మురుగా శరణరు స్వామీజీని రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మైనర్ అమ్మాయిలను?
కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల ప్రజల దగ్గర ఇంతకాలం మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు శివమూర్తి మురగా శరణరు మామీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు పెట్టడం ఇటీవల కర్ణాటకలో కలకలం రేపింది.

స్వామీజీ ఏం చెప్పారు?
చిత్రదుర్గా మురుగా మఠానికి చెందిన విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు చిత్రదుర్గా జిల్లా జైలుకు పంపించారు. కోర్టు అనుమతితో శివమూర్తి మురుగా స్వామీజీని పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారణ చేసి వివరాలు సేకరించారు. అయితే పోలీసుల విచారణలో శివమూర్తి మురుగా శరణరు ఏం చెప్పారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

అమ్మాయిలు సేఫ్
లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు వచ్చిన మురుగా మఠం ఆధీనంలోని అక్కమ్మదేవి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయిలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మురుగా మఠానికి చెందిన హాస్టల్ లో నివాసం ఉంటూ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అమ్మాయిలు అందరిని హాస్టల్ లో నుంచి ఖాళీ చేయించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు సురక్షితంగా ఉన్నారు.

బెయిల్ కోసం స్వామీజీ మనవి
ఇప్పటికే శివమూర్తి మురుగా శరణరు అరెస్టు కావడంతో ఆయన రిమాండ్ అవది బుధవారంతో పూర్తి అయ్యింది. బుధవారం భారీబందోబస్తు మద్య స్వామీజీని చిత్రదుర్గ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని శివమూర్తి మురుగా శరణరు కోర్టుకు మనవి చేశారు.

స్వామీజీ, రశ్మీ మేడమ్ కు నో బెయిల్
శివమూర్తి మురుగా శరణరును 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని చిత్రదుర్గా జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఏ2 ఆరోపి, హాస్టల్ వార్డెన్ రశ్మీకి సెప్టెంబర్ 27వ వరకు జ్యూడీషియల్ కస్టడీ పొడగించారు. ఇదే కేసులో నాలుగవ ఆరోపి, మఠం కార్యదర్శి మరమశివయ్య, 5వ ఆరోపి న్యాయవాది గంగాధరయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications