Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Leader: పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ సీఎం, ఎవరి మీద కేసు పెట్టారో తెలుసా, ఎందుకు సీరియస్?

మాజీ సీఎం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాజీ మంత్రితో పాటు అనేక మంది నాయకుల మీద ఫిర్యదు చేశారు. ఓ వెలుగు వెలిగిన మాజీ సీఎం స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు వేడెక్కిపోతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ. 30, 000 కోట్లు పంపిణీ చేసేందుకు అధికార బీజేపీ నేతలు కుట్ర పన్నారని, ఏకంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ మీద కేపీసీసీ ఆరోపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేశ్‌ జారకిహోళి మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కో ఓటరుకు ₹ 6,000 ఇస్తుందని జనవరి 22న బెళగావిలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి బహిరంగంగా ప్రకటించారని ఆరోపిస్తూ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం, కర్ణాటక అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది.

The former CM who himself went to the police station to file a case against the ruling party leaders along with the former minister, what is happening

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మౌనంగా ఉండటంతో ఇది అందరూ కలిసి ప్లాన్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అత్యున్నత స్థాయిలో జరిగిన కుట్రలో భాగమని సిద్దరామయ్య ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటరుకు ₹ 6,000 అందజేస్తానని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి చెప్పారని, ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ కాపీని కాంగ్రెస్ నేతలు సాక్ష్యంగా పోలీసులకు అందించారు.

The former CM who himself went to the police station to file a case against the ruling party leaders along with the former minister, what is happening

ఓటర్లకు లంచం ఇవ్వడానికి మరియు ఎన్నికలను హైజాక్ చేయడానికి బిజెపి నాయకులు ఇప్పటి నుంచే రూ. 3, ,000 కోట్లకు పైగా ఖర్చు చెయ్యడానికి సిద్దం అయ్యారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కుట్రలో భాగంగా భాజపా నేతలంతా ఉన్నారని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం సిద్దరామయ్య. కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో పాటు బీజేపీ నాయకుల మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+