అదానీ పర్యావరణ విప్లవం: బొగ్గు గనిని పచ్చని అడవిగా మార్చిన అద్భుత ప్రాజెక్ట్!

చాలామంది మైనింగ్ (బొగ్గు తవ్వకాలు) అంటే కేవలం పర్యావరణ విధ్వంసమే అనుకుంటారు. కానీ బాధ్యతాయుతమైన మైనింగ్ ద్వారా పర్యావరణాన్ని తిరిగి ఎలా పునరుద్ధరించవచ్చో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆచరణలో నిరూపించింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఉన్న 'పార్సా ఈస్ట్ అండ్ కాంటా బాసన్’ (PEKB) బొగ్గు గని వేదికగా ఒక భారీ అటవీకరణ కార్యక్రమాన్ని అదానీ సంస్థ విజయవంతంగా చేపట్టింది. రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (RVUNL) కోసం నిర్వహిస్తున్న ఈ మైనింగ్ ప్రాంతాన్ని, ఇప్పుడు పచ్చని అడవిగా మార్చి సరికొత్త రికార్డు సృష్టించింది.

16 లక్షల మొక్కలతో సరికొత్త అడవి.. లక్ష్యం 40 లక్షలు!

పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా అదానీ సంస్థ ఇప్పటికే 568 హెక్టార్ల మైనింగ్ విస్తీర్ణంలో 16 లక్షలకు పైగా మొక్కలను నాటింది. బొగ్గు తవ్వకాలు పూర్తయిన భూమిని మళ్లీ పచ్చదనంతో నింపేందుకు ఒక ప్రత్యేక సూత్రాన్ని పాటిస్తోంది. మైనింగ్ కార్యకలాపాల కోసం తొలగించిన ప్రతి ఒక్క చెట్టుకు బదులుగా.. ఏకంగా 40 కొత్త మొక్కలను నాటడం ఈ కార్యక్రమంలోని అతిపెద్ద విశేషం. ఈ దశాబ్దం ముగిసేలోపు (2030 నాటికి) నాటిన మొక్కల సంఖ్యను 40 లక్షలకు చేర్చాలని సంస్థ ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Adani Enterprises Plants 16 Lakh Trees In Chhattisgarh Mine To Prove Responsible Mining Is A Reality

88 శాతం మనుగడ.. స్థానిక జాతులకే ప్రాధాన్యం

కేవలం మొక్కలు నాటడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి వాటిని సంరక్షిస్తున్నారు. దీనివల్ల ఇక్కడ నాటిన మొక్కల్లో సుమారు 88 శాతం విజయవంతంగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికంగా పెరిగే సాల్, మోదుగ (మహువా), టెండు, అమల్తాస్ మరియు సిధా వంటి చెట్ల జాతులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా, సుమారు 5 లక్షల మొక్కల సామర్థ్యం ఉన్న 3.5 హెక్టార్ల భారీ నర్సరీని అభివృద్ధి చేసి, అంతరించిపోతున్న 'సాల్' అడవుల పునరుద్ధరణను కూడా అదానీ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది.

అదానీ ఫౌండేషన్: క్లబ్‌ఫుట్ చికిత్స కోసం NHM,అనూష్కా ఫౌండేషన్‌తో కీలక ఒప్పందం
అదానీ ఫౌండేషన్: క్లబ్‌ఫుట్ చికిత్స కోసం NHM,అనూష్కా ఫౌండేషన్‌తో కీలక ఒప్పందం

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఘన నివేవాళి

అదానీ సంస్థ చేపట్టిన ఈ పర్యావరణ పునరుద్ధరణ ప్రయత్నాలను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రశంసించింది. ఈ ప్రాజెక్ట్‌ను ఒక "అద్భుతమైన ఉదాహరణ"గా అభివర్ణిస్తూ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ 'లింక్డ్‌ఇన్’ (LinkedIn) లో ఒక పోస్ట్ పెట్టింది. "బొగ్గు తవ్వకాలు ముగిసిన తర్వాత కూడా గని ప్రయాణం ఆగిపోదు, అది పర్యావరణ పునరుద్ధరణకు నాంది పలుకుతుంది" అని కేంద్ర మంత్రిత్వ శాఖ కొనియాడింది. బాధ్యతాయుతమైన మైనింగ్ మరియు పర్యావరణ పరిరక్షణ ఎలా చేతులు కలిపి ముందుకు సాగగలవో ఈ ప్రాజెక్ట్ ప్రపంచానికి చూపిస్తుందని స్పష్టం చేసింది.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి రూ. 259 కోట్ల నిధులు

అదానీ సంస్థ తన అటవీకరణ కార్యక్రమాలను కేవలం ఈ గనికే పరిమితం చేయలేదు. సుర్గుజాతో పాటు కొరియా, బలరాంపూర్ మరియు సూరజ్‌పూర్ అటవీ విభాగాలలో 4,000 హెక్టార్లకు పైగా స్థలంలో అటవీకరణను విస్తరించింది. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల నిర్వహణ మరియు అనుబంధ పర్యావరణ చర్యల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సంస్థ ఇప్పటికే రూ. 259 కోట్లకు పైగా డిపాజిట్ చేసింది. అధికారిక నివేదికల ప్రకారం, సంస్థ అన్ని అటవీ మరియు పర్యావరణ మార్గదర్శకాలను వంద శాతం పాటిస్తూ, క్రమం తప్పకుండా అధికారులకు నివేదికలను సమర్పిస్తోంది.

అదానీ గ్రూప్ రికార్డు: రూ. 1.52 లక్షల కోట్ల పెట్టుబడులతో దేశీ కార్పొరేట్ రంగంలో అగ్రస్థానం
అదానీ గ్రూప్ రికార్డు: రూ. 1.52 లక్షల కోట్ల పెట్టుబడులతో దేశీ కార్పొరేట్ రంగంలో అగ్రస్థానం

పచ్చదనంతో పాటు సామాజిక వికాసం!

మైనింగ్ కార్యకలాపాలతో పాటు పర్యావరణాన్ని కాపాడుతూ, స్థానిక సమాజాల అభివృద్ధిని సమన్వయం చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. గని సమీపంలోని స్థానిక ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు, వారి కోసం విద్య మరియు ఆరోగ్య రంగాల్లో వివిధ సేవా పథకాలను 'అదానీ నేచురల్ రిసోర్సెస్’ అమలు చేస్తోంది. పర్యావరణ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూనే, స్థానిక కమ్యూనిటీల ఆర్థిక, సామాజిక ప్రగతికి ఈ ప్రాజెక్ట్ పెద్దపీట వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+