PF ఖాతాదారులకు శుభవార్త.. ఇక నేరుగా మీ UPI నుంచే విత్ డ్రా
మనం ఎంతో కాలంగా దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ (PF) ఏదైనా అవసరం వచ్చినప్పుడు.. విత్ డ్రా చేయాలంటే ఫారాలు నింపాలి. అప్రూవల్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు. అయితే ఈ పరిస్థితికి త్వరలోనే చెక్ పడనుంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త విధానంతో మీ డబ్బును క్షణాల్లో విత్ డ్రా చేసుకోవచ్చు
UPI ఆధారిత విత్డ్రా వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి EPFO సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త విధానం ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం అమలైతే దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది EPFO సభ్యులకు భారీ ఊరట లభించనుంది. ఇకపై PF డబ్బు కోసం ఫారాలు నింపడం, రోజులు తరబడి ఎదురు చూడడం అవసరం లేకుండా, మొబైల్లో ఉన్న UPI యాప్ ద్వారానే డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. సభ్యులు తమ EPF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ను మొబైల్లోనే చూసుకుని, అవసరమైన మొత్తాన్ని ఎంచుకుని, UPI పిన్ ద్వారా విత్డ్రాను నిర్ధారిస్తే చాలు. డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ కానుంది.

ప్రస్తుత విధానం పెద్దగా ఉపయోగం లేదు..
ప్రస్తుతం ఆన్లైన్ క్లెయిమ్ విధానం ఉన్నప్పటికీ, వైద్య ఖర్చులు, విద్య, పెళ్లి లేదా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అవసరమైన వారికి ఇది పెద్దగా ఉపయోగపడడం లేదు. ఈ నేపథ్యంలోనే EPFO ఈ డిజిటల్ మార్పుకు అడుగులు వేస్తోంది. కొత్త విధానంతో PF డబ్బు తీసుకోవడం ATM లావాదేవీల మాదిరిగానే సులభంగా మారనుంది.
పూర్తిగా విత్డ్రా చేసుకునే అవకాశం
ఇప్పటికే EPFO సెంట్రల్ బోర్డ్ కొన్ని కీలక మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అర్హత ఉన్న సభ్యులు తమ EPF ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్లో 100 శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండగా, రిటైర్మెంట్ భద్రత దృష్ట్యా కొంత మొత్తాన్ని ఖాతాలో ఉంచే నిబంధన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
బ్యాంకుల సహకారంతో
EPFOకు స్వంత బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోవడంతో, ఈ UPI విత్డ్రా వ్యవస్థను బ్యాంకుల సహకారంతో అమలు చేయనున్నారు. భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, మోసాలకు అవకాశం లేకుండా సురక్షిత డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, UPI ద్వారా EPF విత్డ్రా వ్యవస్థ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో ఇది ఒక కీలక మార్పుగా నిలవనుంది. డబ్బు అవసరమైన సమయంలో వెంటనే అందుబాటులోకి రావడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గడమే కాకుండా, డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఇది మరో బలమైన అడుగుగా మారనుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications