కార్పోరేట్ కంపెనీలకు 'మి టు' సెగ: టాటా మోటార్స్ కమ్యూనికేషన్ చీఫ్పై ఆరోపణలు
ముంబై: 'మి టూ' ఉద్యమం బాలీవుడ్, రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలతో పాటు పెద్ద కార్పోరేట్ సంస్థలను కూడా కుదిపేస్తున్నాయి. తాజాగా, టాటా మోటార్స్ కంపెనీలో యువతులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
ముద్దుపెట్టుకున్నంత పని: ఎయిర్హోస్టెస్, అందంగాలేని యువతులే ఇలా: అభిజిత్ తీవ్రవ్యాఖ్య
జర్నలిస్ట్ సంధ్యామీనన్ మరో బాధితురాలి గోడును ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. టాటా మోటార్స్ కార్పోరేట్ కమ్యూనికేషన్ చీఫ్ సురేష్ రంగరాజన్ మహిళలను వేధించారని బాధితురాలు అందించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేశారు.
On Suresh Rangarajan, head of corp comm, Tata Motors.
— Sandhya Menon (@TheRestlessQuil) October 11, 2018
I'm just so sad that young women still go through this every day. pic.twitter.com/rlTIt9VlP5
Allegations are being investigated and an appropriate action will be taken immediately as soon as the enquiry is complete - Tata Motors’ HR pic.twitter.com/Y7qRi1lT3q
— Tata Motors (@TataMotors) October 11, 2018
ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. వీటిపై స్పందించిన టాటా మోటార్స్ అతడిని అడ్మినిస్ట్రేటివ్ లీవ్ కింద ఇంటికి పంపించింది. ప్రతి ఒక్కరికి గౌరవనీయమైన, సురక్షితమైన పని పరిస్థితులను కల్పించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమని టాటా మోటార్స్ ప్రకటించింది. విచారణ అనంతరం రంగరాజన్ పైన చర్యలు ఉంటాయని తెలిపింది.