గృహ, వాహన రుణాల ఈఎంఐలపై RBI తాజా నిర్ణయాలు- లెక్కింపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. వీటిని యాధాతథంగా అంటే ఇప్పుడున్న 5.25 శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల గృహ, వాహన రుణాల ఈఎంఐలు తగ్గే అవకాశం లేదు. అలాగనీ పెరిగే అవకాశం కూడా లేదు. ఎటువంటి ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాల ప్రభావం ఉండదు.
రెపో రేటు యథాతథం..
గత ఫిబ్రవరి సమావేశం మాదిరిగానే ఈసారి కూడా రెపో రేటు యథాతథంగా 5.25 శాతం వద్ద ఉంచింది రిజర్వ్ బ్యాంక్. రెపో రేటుతో పాటుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో కూడా మార్పులు చేయలేదని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. వీటిని అయిదు శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు చెప్పారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ సైతం 5.50 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. వీటి విషయంలో ఎంపీసీ కమిటీ తటస్థ విధానాన్ని కొనసాగించిందని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.

నెలవారీ వాయిదాల్లో మార్పు ఉండదు
దీనితో గృహ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాల నెలవారీ వాయిదాల్లో మార్పు ఉండదు. రుణగ్రహీతలు, డిపాజిటర్లకు ప్రస్తుతానికి ఎటువంటి తక్షణ ఉపశమనం కూడా లభించలేదు. గత ఏడాది 125 బేసిస్ పాయింట్ల (BPS) కోత తర్వాత ఆర్బీఐ ఈ రేటును స్థిరంగా ఉంచింది. 2020 మే నుంచి 2022 ఏప్రిల్ మధ్య రెపో రేటు నాలుగు శాతంగా ఉండేది. ఆ తర్వాత 2022 ఏప్రిల్ నుండి 2023 ఫిబ్రవరి వరకు అది 6.5 శాతానికి పెరిగింది. రెండేళ్లపాటు అదే రెపో రేటు కొనసాగింది.
కొత్త రుణాల వడ్డీ రేట్లు కూడా..
రేపో రేటులో మార్పు లేకపోవడంతో, ఇప్పటికే రుణాలు ఉన్నవారి EMIలలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే కొత్త రుణాల వడ్డీ రేట్లు కూడా ప్రస్తుతానికి స్థిరంగా ఉంటాయి. బ్యాంకులు తమ మార్జిన్లను సర్దుబాటు చేయాలనుకుంటే తప్ప గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ప్రస్తుత రేట్లను కొనసాగించవచ్చు.
గృహ రుణగ్రహీతలకు..
- 30 సంవత్సరాల కాలానికి 8.20 శాతం వడ్డీతో రూ. 50 లక్షల హోమ్ లోన్పై ప్రస్తుత ఈఎంఐ 37,346 రూపాయల మొత్తం అలాగే ఉంటుంది. ఇది ఇక ముందు కూడా కొనసాగుతుంది. దీనివల్ల నెలవారీ లేదా వార్షిక పొదుపులు జీరోగా మారుతాయి. అలాగే అదనపు భారం కూడా ఉండబోదు.
వ్యక్తిగత రుణగ్రహీతలకు..
- అయిదు సంవత్సరాల కాలానికి 12 శాతం వడ్డీతో అయిదు లక్షల రూపాయల పర్సనల్ లోన్ ఉంటే దాని ఈఎంఐ 11,122 రూపాయల వద్ద స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు మారకపోవడంతో మిగులుబాటు లేదా అదనపు భారం ఉండదు.
ఉపశమన చర్యలు లేవు..
2025 నాటి రెపో రేటును ఏకంగా 125 బేసిస్ పాయింట్లు తగ్గించి రుణగ్రహీతలకు ప్రయోజనం కల్పించింది. ఈ ఏడాది అటువంటి ఉపశమన చర్యలు లేవు. ఫిబ్రవరి నాటి సమావేశంలో ఈ తగ్గింపులకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి 5.25 శాతం వద్ద రెపో రేటు స్థిరంగా కొనసాగుతోంది.
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications