SpaceX IPO: మస్క్ సంచలనం.. మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఎంట్రీ!

ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. టెక్ దిగ్గజం, సంచలనాల నిర్ణేత ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూ (IPO)కు సర్వం సిద్ధం చేసుకుంది. దాదాపు 1.75 ట్రిలియన్ డాలర్ల కళ్లు చెదిరే వాల్యుయేషన్‌తో రాబోతున్న ఈ ఐపీఓపై ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఈ ఒక్క ఐపీఓ ద్వారానే ఏకంగా 75 బిలియన్ డాలర్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే గనుక జరిగితే, స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద ఆరంభంగా నిలిచిపోనుంది. జూన్ 12న నాస్‌డాక్ (Nasdaq) వేదికగా 'SPCX' అనే టిక్కర్ పేరుతో ఈ షేర్ల ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది.

సంప్రదాయానికి భిన్నంగా.. జూన్ 11న ధర ఖరారు!

సాధారణంగా వాల్ స్ట్రీట్‌లో రోడ్‌షోలు ముగిసిన తర్వాతే షేర్ ధరను నిర్ణయిస్తారు. కానీ, మస్క్ శైలి ఎప్పుడూ భిన్నమే! సంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా స్పేస్‌ఎక్స్ ముందే తన షేర్ ధరను 135 డాలర్లుగా సూచించింది. జూన్ 11న ఈ ధరను కంపెనీ అధికారికంగా ఖరారు చేయనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఐపీఓకి డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. అందుబాటులో ఉన్న షేర్ల కంటే కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు రెట్టింపు ఆసక్తి చూపిస్తున్నారు.

SpaceX IPO Elon Musk Eyes Historic 1 75 Trillion Dollars Valuation On Nasdaq This Friday

సామాన్యులకు బంపర్ ఆఫర్.. రిటైల్ ఇన్వెస్టర్లకు 30% కేటాయింపు!

ఈ ఐపీఓలో అత్యంత విశేషమైన అంశం ఏంటంటే.. సాధారణంగా పెద్ద పెద్ద ఐపీఓలలో సంస్థాగత పెట్టుబడిదారులకే (ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ, స్పేస్‌ఎక్స్ మాత్రం సామాన్య రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఏకంగా 30 శాతం వాటాను కేటాయించింది. ద్రవ్య రూపంలో చెప్పాలంటే దాదాపు 22.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు వ్యక్తిగత పెట్టుబడిదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో రిటైల్ కేటాయింపులు జరగడం మార్కెట్ చరిత్రలోనే చాలా అరుదు. రాబిన్‌హుడ్, ఫిడిలిటీ, సోఫీ, ఈ-ట్రేడ్, చార్లెస్ ష్వాబ్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇన్వెస్టర్లు ఈ షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, విపరీతమైన పోటీ ఉన్నందున దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ షేర్లు దక్కుతాయనే గ్యారెంటీ లేదు.

విలవిల్లాడుతున్న రూపాయి, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
విలవిల్లాడుతున్న రూపాయి, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

భారతీయ ఇన్వెస్టర్లకు అవకాశం ఉందా?

ఈ మెగా ఐపీఓలో పాల్గొనేందుకు భారతదేశంతో పాటు యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కూడా స్పేస్‌ఎక్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, భారతీయ ఇన్వెస్టర్లకు ఐపీఓలో నేరుగా పాల్గొనే అవకాశం కొంత పరిమితంగానే ఉంటుంది. మనవాళ్లు ఆర్‌బీఐ తీసుకొచ్చిన 'లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్' (LRS) నిబంధనల ప్రకారం ఏడాదికి 2,50,000 డాలర్ల పరిమితి లోపు గ్లోబల్ బ్రోకరేజ్ అకౌంట్ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ ఐపీఓలో షేర్లు దక్కకపోతే, జూన్ 12న నాస్‌డాక్‌లో ట్రేడింగ్ మొదలైన తర్వాత నేరుగా మార్కెట్నుంచి కొనుగోలు చేయవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల (ETF) ద్వారా కూడా పరోక్షంగా ఈ సంస్థలో భాగస్వాములు కావచ్చు.

ప్రస్తుతం నష్టాల్లోనే.. కానీ చూపు భవిష్యత్తుపైనే!

ఆర్థిక లెక్కల విషయానికి వస్తే స్పేస్‌ఎక్స్ ప్రస్తుతం నష్టాల్లోనే నడుస్తోంది. 2025లో ఈ కంపెనీ 18.67 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించినప్పటికీ, 4.94 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. సమీప భవిష్యత్తులో కూడా లాభాలు వచ్చే అవకాశం లేదని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ అమ్మకాల కంటే 90నుంచి 110 రెట్లు అధిక వాల్యుయేషన్ (1.75 ట్రిలియన్ డాలర్లు) కట్టడంపై మార్కెట్ నిపుణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాభాలు లేకపోవడం వల్ల ఎస్‌అండ్పీ 500 (S&P 500) వంటి కీలక ఇండెక్స్‌లలో ఇప్పుడే చోటు దక్కించుకోవడం కూడా కష్టమే. అయినప్పటికీ, ఏరోస్పేస్ రంగంలో లాంగ్ టర్మ్ వృద్ధిని, భవిష్యత్ ప్రయోజనాలను ఆశించే ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు.

Verse Innovation:లాభాల బాటలో వెర్స్ ఇన్నోవేషన్ - త్వరలో IPO..!!
Verse Innovation:లాభాల బాటలో వెర్స్ ఇన్నోవేషన్ - త్వరలో IPO..!!

మస్క్ పట్టు బిగువు.. ప్రపంచంలోనే తొలి 'ట్రిలియనీర్' అయ్యే ఛాన్స్!

కంపెనీ పబ్లిక్ వెళుతున్నప్పటికీ ఎలోన్ మస్క్ తన నియంత్రణను కోల్పోవడం లేదు. 'డ్యూయల్-క్లాస్ ఓటింగ్' పద్ధతి ద్వారా కంపెనీపై పూర్తి పట్టు ఆయన చేతిలోనే ఉంటుంది. పైగా ఈ ఐపీఓలో మస్క్ తన సొంత షేర్లను ఒక్కటి కూడా అమ్మడం లేదు. ఒకవేళ లిస్టింగ్ తర్వాత మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా కంపెనీ విలువ పెరిగితే, ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (లక్ష కోట్ల డాలర్ల అధిపతి)గా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన హెచ్చరిక!

ఈ ఐపీఓపై విపరీతమైన అంచనాలు ఉన్నప్పటికీ మార్కెట్ నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఏరోస్పేస్ రంగంలో నిర్వహణ వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే భవిష్యత్తులో ఇతర టెక్, ఏఐ సంస్థలనుంచి గట్టి పోటీ ఎదురయ్యే ప్రమాదం ఉంది. లిస్టింగ్ అయిన తొలి రోజుల్లో షేర్ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అనిశ్చితి) ఉండవచ్చు. అంతేకాకుండా, లాక్-అప్ పీరియడ్ ముగిసిన తర్వాత కంపెనీ పాత ఇన్వెస్టర్లు, ఉద్యోగులు తమ షేర్లను విక్రయిస్తే ధరలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కాబట్టి, ప్రస్తుత ఆదాయం కంటే కంపెనీ లాంగ్ టర్మ్ భవిష్యత్తును నమ్మి పెట్టుబడి పెట్టే వారికే ఇది సరైన వేదిక అని విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+