నా దేశం కోసం నేను వర్క్ ఫ్రమ్ హోమ్.. HRకు షాకింగ్ మెయిల్!

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ఆఫీసుకి వెళ్లడం ఇష్టం లేకనో, వ్యక్తిగత కారణాల వల్లో ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) అడుగుతుంటారు. కానీ, ఒక యువతి మాత్రం ఏకంగా "దేశం కోసం" తనకు ఇంటి నుంచే పని కావాలని హెచ్‌ఆర్ (HR) విభాగానికి మెయిల్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వినూత్న ప్రయత్నం నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

మోదీ పిలుపు.. సుప్రియ స్పందన!

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్న తరుణంలో, ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రజలు మళ్లీ 'వర్క్ ఫ్రమ్ హోమ్' వైపు మొగ్గు చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన ఈ ప్రకటనను సుప్రియ అనే యువతి సీరియస్‌గా తీసుకుంది. వెంటనే తన ఆఫీసు హెచ్‌ఆర్‌కు ఒక మెయిల్ పంపింది. అందులో, "ప్రధాని మోదీ విజ్ఞప్తికి మద్దతుగా, నా దేశం కోసం నేను చేయగలిగిన కనీస సేవగా మే 10, 2027 వరకు ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నాను" అని పేర్కొంది.

Work From Home For Nation Woman s Email To HR Following PM Modi s Energy Saving Appeal Goes Viral

"నేను నా వంతు చేశాను.. మరి మీరు?"

తాను పంపిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌ (X) వేదికగా షేర్ చేస్తూ.. "నేను దేశం కోసం నా వంతు కృషి చేశాను... ఇప్పుడు మీ వంతు" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే భలే ప్లాన్ వేశావమ్మా అని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం హ్యూమరస్ వ్యాఖ్యలతో సెటైర్లు వేస్తున్నారు. "మీ దేశభక్తికి మెచ్చి హెచ్‌ఆర్ మీకు పర్మనెంట్ లీవ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఒక నెటిజన్ చమత్కరించగా, "ప్రియమైన మోదీ జీ.. వెంటనే ప్రధాన్ మంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ యోజనను అమలు చేయండి" అంటూ మరొకరు రాసుకొచ్చారు.

దేశ ప్రజలకు విజ్ఞప్తి! పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక ప్రకటన
దేశ ప్రజలకు విజ్ఞప్తి! పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక ప్రకటన

ఎందుకీ ప్రకటన?

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇంధన పొదుపు అవసరమని ప్రధాని గుర్తుచేశారు. "కరోనా సమయంలో మనం ఆన్‌లైన్ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లకు అలవాటుపడ్డాం.. మళ్లీ ఆ విధానాన్ని పాటిస్తే దేశానికి మేలు జరుగుతుంది" అని ఆయన సూచించారు.

ఏడాది పాటు గోల్డ్ కొనకపోతే దేశానికి ఏమవుతుంది? మోదీ మాస్టర్ ప్లాన్!
ఏడాది పాటు గోల్డ్ కొనకపోతే దేశానికి ఏమవుతుంది? మోదీ మాస్టర్ ప్లాన్!

ఉద్యోగ సంఘాల మద్దతు!

ప్రధాని ప్రకటనతో ఐటీ ఉద్యోగుల సంఘం 'నైట్స్' (NITES) కూడా రంగంలోకి దిగింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సాధ్యమైన అన్ని విభాగాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది. మొత్తంమీద, సుప్రియ చేసిన ఈ చిన్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా 'వర్క్ ఫ్రమ్ హోమ్' చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది

ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన వినియోగం గురించి ప్రజలను ఏమి చేయమని కోరారు మరియు ఎందుకు?
గ్లోబల్ చమురు ధరలు పెరుగుతున్నందున మరియు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నందున చమురు వినియోగాన్ని తగ్గించాలని మోదీ ప్రజలను కోరారు.
సుప్రియ తన వైరల్ ఇమెయిల్‌లో ఏమి ప్రకటించింది మరియు ఆమె ఎప్పటి వరకు ఇంటి నుండి పని చేయాలని యోచిస్తోంది?
మే 10, 2027 వరకు ఇంటి నుండి పని చేస్తానని, ఇది దేశానికి తన అత్యంత కనీస సహకారం అని ఆమె పేర్కొంది.
సోషల్ మీడియాలో సుప్రియ యొక్క WFH సందేశానికి నెటిజన్లు ఎలా స్పందించారు?
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుండి హాస్య మరియు వ్యంగ్య ప్రతిస్పందనలు వచ్చాయి.
HR లేదా టెక్స్ట్ లో పేర్కొన్న అంతర్గత కల్పిత సమాధానం ఏమిటి?
సుప్రియ దేశభక్తి ముందుకు సాగుతుందని, ఆమె శాశ్వతంగా ఇంటి నుండి పని చేస్తుందని, ఆమె జీతం తగ్గించడం ద్వారా ఆమె విధులు మరియు ప్రయాణ నిధులను సర్దుబాటు చేస్తామని ఒక నకిలీ HR సమాధానం సూచించింది.
ప్రధానమంత్రి పిలుపుకు ఐటీ కార్మికుల సంఘం మరియు NIITE ఎలా స్పందించాయి?
శక్తి పరిరక్షణకు మద్దతుగా వీలైన చోట WFHని అమలు చేయాలని NIITE మరియు IT కార్మికుల సంఘం కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖను కోరాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+