College girl: వరుసకు అన్న, అందర్నీ నమ్మించాడు. బెడ్ రూమ్ లో గొంతు కోసి చంపేసి!
చెన్నై/ మదురై/ పుదుక్కోటై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త చనిపోవడంతో భార్య దిగులు చెందింది. కాలేజ్ లో చదువుతున్న కుమార్తెను చదివించుంటున్న ఆమెకు ఉద్యోగం వచ్చినా మగ దిక్కలేని ఇంటిలో దిగులుగా ఉంటున్నది. ఇదే సమయంలో వరుసకు కొడుకు అయ్యే యువకుడు వారికి సహాయం చెయ్యడానికి వాళ్ల ఇంట్లో మకాం వేశాడు.
వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని రోజూ కాలేజ్ దగ్గర వదిలిపెడుతూ సాయంత్రం మళ్లీ కాలేజ్ నుంచి ఇంటికి పిలుచుకుని వస్తు వాళ్లకు దగ్గర అయ్యాడు. ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్లిన తల్లి తన కుమార్తెను గొంతు కోసి చంపేశారని గుర్తించి కుప్పకూలిపోయింది. ఇంట్లో ఇంతకాలం తమకు తోడుగా ఉన్న యువకుడే చెల్లిని హత్య చేశాడని తెలుసుకున్న తల్లి షాక్ అయ్యింది.
Illegal affair: భర్త విదేశాల్లో, ఆంటీతో ఎంజాయ్, కూతురితో ?, బిగ్ షాట్ కొడుకు లీలలు!
భర్తకు ప్రభుత్వ ఉద్యోగం
తమిళనాడులోని పుదుక్కోటైలోని పోన్ నగర్ లో పళనియప్పన్, శివసామి దంపతులు నివాసం ఉంటున్నారు. పళనియప్పన్, శివసామి దంపతులకు లోఖప్రియా (20) అనే కుమార్తె ఉంది. పళనియప్పన్ తమిళనాడు విద్యుత్ బోర్డు శాఖలో ఉద్యోగం చేస్తూ భార్య శివసామి, కుమార్తె లేఖప్రియాను బాగా చూసుకునేవాడు.
భర్త చనిపోవడంతో షాక్
లోఖప్రియా కుమార్తె పుదుక్కోటైలోని మహిళా ఆర్ట్స్ కాలేజ్ లో చదువుతోంది. ఏడాది క్రితం అనారోగ్యానికి గురైన పళనియప్పన్ చికిత్స విఫలమై మరణించాడు. భర్త పళనియప్పన్ మరణించడంతో షాక్ గురైన భార్య శివసామి కుమార్తెను చూసుకుంటూ మగ దిక్కులేని ఇంట్లో ఉంటున్నది. తల్లికి ధైర్యం చెబుతున్న లేఖప్రియా కొంచెం ధైర్యంగా ఉండేది.
సహాయం కోసం వచ్చిన బంధువు
భర్త పళనియప్పన్ చనిపోవడంతో ఆయన ఉద్యోగం భార్య శివసామికి వచ్చింది. ఉద్యోగం చేసుకుంటున్న శివసామి సహాయం చెయ్యడానికి మగవాళ్లు ఎవ్వరూ దగ్గర లేకపోవడంతో ఇబ్బంది పడింది. ఇదే సమయంలో శివసామి సోదరి కుమారుడు సురేష్ వీరికి సహాయం చెయ్యడానికి వాళ్ల ఇంటికి వెళ్లాడు.
సోదురు కావడంతో నో డౌట్
లేఖప్రియాకు వరుసకు సురేష్ సోదరుడు అవుతాడు. లేఖప్రియాను కొంతకాలం క్రితం వరకు ప్రతిరోజూ కాలేజ్ దగ్గర వదిలిపెట్టడం, సాయంత్రం మళ్లీ ఆమెను కాలేజ్ నుంచి ఇంటికి పిలుచుకువస్తున్న సురేష్ ఇంటికి అవసరమైన సరుకులు తెచ్చిస్తూ వాళ్లకు మగవాళ్లు లేని లోటు తీరుస్తూ వస్తున్నాడు. వరుసకు తన కుమార్తె లేఖప్రియాకు సురేష్ సోదరుడు కావడంతో తల్లి శివసామి వారిని ఇంట్లో ఫ్రీగా ఉండటానికి వదిలేసింది.
ఉద్దరగా వస్తాయని ఆరెండింటి కోసం ఆశపడిన అన్న
పళనిస్వామి ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడం, వయసుకు వచ్చిన కూతురు ఇంట్లో ఉండటంతో సురేష్ ఆలోచనలు చాలా రకాలుగా వెళ్లాయి. ఇంట్లో భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు ఉంటాయని, వాటిని నొక్కేయాలని సురేష్ కొంతకాలం నుంచి వేచిచూస్తూ స్కెచ్ లు వేస్తున్నాడు. కరోనా దెబ్బతో కాలేజ్ మూసి వేయడంతో లేఖప్రియా ఇంట్లోనే ఉంటున్నది.
చెల్లి గొంతు కోసి చంపేసిన అన్న
ఉదయం ఇంట్లో వంట చేసిన శివసామి ఉద్యోగానికి వెళ్లిపోయింది. లేఖప్రియా బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో సురేష్ కత్తి తీసుకుని వెళ్లి ఆమె గొంతు కోసి వెయ్యడంతో ఆమె ప్రాణాలు నిమిషాల్లో పోయాయి. చెల్లిని దారుణంగా చంపేసిన సురేష్ ఇంట్లోని బీరువా, లాకర్, పెట్టలు, డబ్బాలు అన్నీ పరిశీలించాడు. ఎక్కడా అతనికి బంగారు నగలు, చివరికి ఉంగరం కూడా చిక్కలేదు. ఓ డబ్బాలో కేవలం రూ. 2 వేలు మాత్రమే చిక్కడంతో సురేష్ చాలా నిరాశ చెందాడు.
తాగుబోతు... తిరుగుబోతు... ఊరంతా అప్పులే
అనవసరంగా చెల్లిని చంపేశామని అనుకున్న సురేష్ ఆ రెండు వేల రూపాయలు కూడా వదలకుండా దానిని జోబులో వేసుకున్నాడు. చనిపోయిన చెల్లెలు లేఖప్రియా మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుంచి పరారైనాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన శివసామి కుమార్తె లేఖప్రియా బెడ్ రూమ్ లో శవమై కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. శివసామి కేకలు విన్న స్థానికులు వెళ్లి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో సురేష్ వ్యవహారం బయటపడింది. పనిపాట లేకుండా తిరుగుతున్న సురేష్ మద్యం వ్యసనానికి బానిస అయ్యాడని, జులాయిగా తిరుగుతూ ఊరంతా అప్పులు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
నమ్మినందుకు నాశనం చేశాడు
అన్ని విషయాలు తెలిసినా సురేష్ ను మందలిస్తే అతను ఇల్లు వదిలివెళ్లిపోతాడని, తరువాత మగ దిక్కులేని ఆడవాళ్లు అని అందరి కళ్లు మా మీదే పడుతాయని అతన్ని ఏమీ మాట్లాడకుండా వదిలేశానని, చివరికి నా కూతురు ప్రాణం పోయిందని, మా జీవితాలను నాశనం చేశాడని శివసామి బోరున విలపిస్తోంది. డబ్బు, నగల కోసం చెల్లిని వరుసకు అన్న అయ్యే వ్యక్తి హత్య చెయ్యడం పుదుక్కోటైలో కలకం రేపింది.