Daughter: తండ్రి దుబాయ్ రిటన్, ఇంట్లో ఇద్దరు కూతుర్లు, రెండో కూతురిని ఏం చేశాడంటే, ఫినిష్!
చెన్నై/ కడలూరు: దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి సెలవులపై సొంత ఊరికి వచ్చి భార్య, ఇద్దరు కూతుర్లలో కలిసి ఉండేవాడు. సెలవులు పూర్తి అయిన తరువాత మళ్లీ దుబాయ్ వెలుతున్న ఆ వ్యక్తి అక్కడ డబ్బులు బాగా సంపాధించి తిరిగి వచ్చాడు. సొంత ఊరికి వచ్చిన తరువాత అతని భార్య అనారోగ్యానికి గురి కావడంతో తరువాత అతను దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో ఇద్దరు కూతుర్లతో కలిసి అతను సొంత ఇంటిలో నివాసం ఉంటున్నాడు.
రెండు రోజుల క్రితం అతని రెండో కూతురు మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన తండ్రి గత ఏడాది నుంచి తనను బెదిరించి తన మీద అత్యాచారం చేస్తున్నాడని కేసు పెట్టడంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు. తన తల్లి చనిపోయిన తరువాత తన తండ్రి ఎలాంటి అరాచకాలు చేశాడు అనే విషయం ఆ అమ్మాయి పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పడం కలకలం రేపింది.

దుబాయ్ లో ఉద్యోగం
తమిళనాడులోని కడలూరులోని మహమ్మద్ ఫరూక్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఫరూక్ కు వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత ఫరూక్ దుబాయ్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. ఫరూక్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న ఫరూక్ సెలవులపై సొంత ఊరికి వచ్చి అతని భార్య, ఇద్దరు కూతుర్లలో కలిసి ఉండేవాడు.

డబ్బులు బాగా సంపాధించాడు
సెలవులు పూర్తి అయిన తరువాత మళ్లీ దుబాయ్ వెలుతున్న ఫరూక్ అక్కడ డబ్బులు బాగా సంపాధించి తిరిగి వచ్చాడు. సొంత ఊరికి వచ్చిన తరువాత ఫరూక్ భార్య అనారోగ్యానికి గురి కావడంతో తరువాత అతను దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. భార్యకు చికిత్స చేయిస్తున్న సమయంలో ఇక నువ్వు దుబాయ్ కు వెళ్లకుండా ఇక్కడే ఉండి భార్య, కూతుర్లను చూసుకోవాలని కుటుంబ సభ్యులు ఫరూక్ కు సూచించారు.

కూతుర్లతో కలిసి ఉంటున్న తండ్రి
అనారోగ్యంతో ఫరూక్ భార్య గత ఏడాది చనిపోయింది. భార్య చనిపోయిన తరువాత ఫరూక్ అతని ఇద్దరు కూతుర్లతో కలిసి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఫరూక్ కు 18 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కడలూరులోని ఓ స్కూల్ లో ఫరూక్ కూతుర్లు ఇద్దరూ చదువుకుంటున్నారు.

బిత్తరపోయిన పోలీసులు
రెండు రోజుల క్రితం ఫరూక్ రెండో కూతురు కడలూరు మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన తండ్రి ఫరూక్ గత ఏడాది నుంచి తనను బెదిరించి తన మీద అత్యాచారం చేస్తున్నాడని, ఈ విషయం బయటకు చెబితే నిన్ను, మీ అక్కను చంపేసి శవాలు మాయం చేస్తానని బెదిరిస్తున్నాడని కేసు పెట్టడంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

కామాంధుడు అరెస్టు
తన తల్లి చనిపోయిన తరువాత తన తండ్రి ఫరూక్ ఎలాంటి అరాచకాలు చేశాడు అనే విషయం ఆ అమ్మాయి పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి మహేశ్వరి అమ్మాయి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుని కామాంధుడైన ఆమె తండ్రి ఫరూక్ ను ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి బెండ్ తీశారు.
Recommended Video

పెద్ద కూతురిని ఏమైనా?
రెండో కూతురి మీద అత్యాచారం చేసిన కామాంధుడు అతని పెద్ద కూతురి మీద కూడా ఏమైనా అఘాయత్నం చేశాడా ? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కన్నతండ్రి అమ్మాయి మీద సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నాడని వెలుగు చూడటంతో కడలూరు ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications