Doubt: యువకుడితో భార్య చాలా క్లోజ్, ఊరు మార్చిన భర్త, అక్కడ కూడా ?, నరికి చంపేసిన కల్యాణ్, ఎస్కేప్!
చెన్నై/ తిరుప్పూర్: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. అయితే దంపతులు మాత్రం నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు. కొంతకాలం తరువాత భర్త అతని భార్యతో కలిసి వేరే ఊరికి కాపురం మార్చాడు. అక్కడ కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన భార్య వేరే యువకుడితో క్లోజ్ గా ఉంటుందని భర్త రగిలిపోతున్నాడు. ఇదే సమయంలో ఇంటికి వెళ్లిన భర్త అక్కడ సీన్ చూసి ఆవేశంతో ఊగిపోయి కొడవలితో అతని భార్యను నరికి చంపేశాడు.
Delivery boy: వీడి పని ఏంది ?, వీడు చేస్తున్నది ఏమిటి ?, అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్!
కొన్ని సంవత్సరాల క్రితం!
తమిళనాడులోని తిరుప్పూర్ లో కల్యాణ్ సుందరం అలియాస్ కల్యాణ్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కల్యాణ్ కు అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. అదే సమయంలో బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి రామలక్ష్మి (35) అనే మహిళతో కల్యాణ్ పెళ్లి జరిపించారు.
దంపతుల మద్య తేడాలు
పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న కల్యాణ్, రామలక్ష్మి దంపతులు ఐదు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగిన ఐదు సంవత్సరాల తరువాత కల్యాణ్, రామలక్ష్మి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు రామలక్ష్మి, కల్యాణ్ దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. అయితే రామలక్ష్మి కాని, కల్యాణ్ కాని పెద్దల మాట వినకుండా నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు.
ఫ్యామిలీ షిఫ్ట్
రామలక్ష్మి ఓ యువకుడితో చనువుగా ఉంటుందని తెలుసుకున్న ఆమె భర్త కల్యాణ్ రగిలిపోయాడు. పద్దతిమార్చుకోవాలని కొంతకాలం నుంచి భార్య రామలక్ష్మికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడని తెలిసింది. తిరుప్పూర్ లో గొడవలు ఎక్కువ కావడంతో విసిగిపోయిన కల్యాణ్ అతని భార్య రామలక్ష్మితో కలిసి మనూర్ లోని తెర్కువాగైకుళం ప్రాంతానికి మకాం మార్చేశాడు.
భార్యను నరికి చంపేసిన భర్త
వేరే ఊరికి కాపురం మార్చిన తరువాత కూడా రామలక్ష్మి, కల్యాణ్ సందరంల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన భార్య రామలక్ష్మి ఇక్కడ కూడా వేరే యువకుడితో క్లోజ్ గా ఉంటుందని కల్యాణ్ రగిలిపోతున్నాడు. ఇదే సమయంలో ఇంటికి వెళ్లిన కల్యాణ్ అక్కడ సీన్ చూసి ఆవేశంతో ఊగిపోయి కొడవలితో అతని భార్య రామలక్ష్మిని నరికి చంపేశాడు.
భర్త గ్రేట్ ఎస్కేప్
భార్య రామలక్ష్మిని హత్య చేసిన కల్యాణ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. విషయం తెలుసుకున్న మనూర్ పోలీసులు రామలక్ష్మి శవాన్ని ఆసుపత్రికి తరలించారు. భార్య రామలక్ష్మిని హత్య చేసిన కల్యాణ్ కోసం గాలిస్తున్నామని మనూర్ పోలీసు అధికారులు తెలిపారు. ఊరు మార్చినా దంపతుల కాపురం చక్కబడలేదని, ఒకరి ప్రాణం పోయిందని రామలక్ష్మి, కల్యాణ్ కుటుంబ సభ్యులువిచారం వ్యక్తం చేస్తున్నారు.