Girlfriend: మాజీ ప్రియుడితో గొడవ, నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ను పిలిపించి ఏం చేసిందంటే? దెబ్బకు!
చెన్నై/ కోడైక్కెనాల్: ఓ యువకుడు పీజీ సెంటర్ నడుపుతున్నాడు. ఇదే సమయంలో ఆ యువకుడికి ఓ యువతి పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ అతని పీజీ హాస్టల్ రూమ్ లోనే ఉన్నారు. పెళ్లి కాకుండానే ఇద్దరూ సహజీవనం చేశారు. కొంతకాలం ప్రియుడితో ఆమె ఎంజాయ్ చేసింది. ప్రియుడికి చెడుఅలవాట్లు ఉన్నాయని తెలుసుకుని ఆమె సొంత ఊరికి వెళ్లిపోయింది.
ప్రియుడి ఫోన్ నెంబర్ బ్లాక్ చేింది. ప్రియుడు అదే ప్రాంతంలో ఉన్నాడు. చాలాకాలం తరువాత ప్రియురాలు ఉద్యోగం చెయ్యడానికి ఓ ఊరికి వెళ్లింది. అదే ఊరిలో ప్రియుడు ఉన్నాడు. ప్రియుడి ఫోన్ నెంబర్ అన్ బ్లాక్ చెయ్యడం, తరువాత ఇద్దరు కలుసుకోవడం చకచకా జరిగిపోయింది. తరువాత యువతి ఆమె నలుగురి బాయ్ ఫ్రెండ్స్ ను పిలిపించి ప్రియుడిని హత్చ చేయించడం కలకలం రేపింది.
Wife: భార్య లేడీ పోలీసు, భర్త సైనికుడు, మద్యలో చాలా గ్యాప్ వచ్చిందని ?, భార్యను సింపుల్ గా చంపేసి!
పీజీ నడుపుతున్న యువకుడు
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాకు చెందిన సూర్యా అనే యువకుడు కోడైక్కెనాల్ చేరుకుని అక్కడి పూంబరాయి కొండలో పీజీ (ప్రైవేట్ హాస్టల్ )నడుపుతున్నాడు. విహారయాత్రకు వస్తున్న వారికి వసతి కల్పిస్తున్న సూర్యా డబ్బులు బాగానే సంపాధించాడు. కోడైక్కెనాల్ పర్యాటక కేంద్రం కావడంతో సూర్యా విలాసవంతమైన జీవితం గడిపాడు.
చెన్నై యువతి ఎంట్రీ
చెన్నైలోని కొట్టివక్కట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్వేతా (25) అనే యువతి గత ఏడాది కొడైక్కెనాల్ వెళ్లింది. ఆ సందర్బంలో సూర్యాకు, శ్వేతాకు పరిచయం అయ్యింది. తరువాత సూర్యా, శ్వేతా చనువు పెంచుకున్నారు. ఉద్యోగం చెయ్యడానికి కొడైక్కెనాల్ వెళ్లిన శ్వేతా బాయ్ ఫ్రెండ్ సూర్యా పీజీ హాస్టల్ లో మకాం వేసింది.
ప్రియుడితో ఎంజాయ్ చేసి చివరికి?
పెళ్లి కాకుండానే సూర్యా, శ్వేతా స్థానికులకు భార్యభర్తలు అని చెప్పి ఇద్దరూ సహజీవనం చేశారు. చాలాకాలం ప్రియుడు సూర్యాతో శ్వేతా ఎంజాయ్ చేసింది. కొంతకాలం తరువాత ప్రియుడు సూర్యాకు మద్యం సేవించడంతో పాటు చాలా చెడుఅలవాట్లు ఉన్నాయని తెలుసుకుని శ్వేతా అతనికి దూరం అయ్యి చెన్నై వెళ్లిపోయింది.
నెల ముందు మేడమ్ రీఎంట్రీ
శ్వేతా వెళ్లిపోయిన తరువాత సూర్యా కొడైక్కెనాల్ లోనే ఉన్నాడు. చెన్నై వెళ్లిపోయిన శ్వేతా ఆమె ప్రియుడి సూర్యా ఫోన్ నెంబర్, వాట్సాప్ బ్లాక్ చేసింది. సూర్యా మాత్రం కొడైక్కెనాల్ లోనే ఉన్నాడు. నెల రోజుల క్రితం శ్వేతా మళ్లీ ఉద్యోగం చెయ్యడానికి కొడైక్కెనాల్ వెళ్లింది. ఎందుకో శ్వేతా ఆమె మాజీ ప్రియుడు సూర్యా ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అన్ బ్లాక్ చేసింది.
కొట్టి చంపేసిన కిలాడీ లేడీ బాయ్ ఫ్రెండ్స్
మాజీ ప్రియుడు సూర్యా ఫోన్ నెంబర్ అన్ బ్లాక్ చెయ్యడంతో అతను మళ్లీ శ్వేతాకు టచ్ లోకి వెళ్లాడు. రాత్రి శ్వేతా, సూర్యాల మద్య గొడవ జరిగింది. తరువాత శ్వేతా ఆమె బాయ్ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి చెప్పింది. మరుసటి రోజు శ్వేతా బాయ్ ఫ్రెండ్స్ వెళ్లి సూర్యాను చితకబాదేశారు. తలకు తీవ్రగాయాలైన సూర్యాను కొడైక్కెనాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూర్యా చనిపోయాడని. కేసు విచారణలో ఉందని కొడైక్కెనాల్ పోలీసులు తెలిపారు. సూర్యా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరు శ్వేతాతో పాటు ఆమె నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.