Illegal affair: భర్తకు విడాకులు, 20 సార్లు పొడిచి చంపిన ప్రియుడు, పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్!
చెన్నై/ కన్యాకుమారి/ కొచ్చి: కుటుంబ సభ్యులు చూపించిన యువకడిని వివాహం చేసుకున్న యువతి భర్తతో జీవితాంతం కాపురం చేసి పిల్లాపాలతో సంతోషంగా ఉండాలని అనుకుంది. అయితే పరిస్థితులు అనుకూలించపోవడంతో దంపతులు విడిపోయారు. ఆరు నెలల నుంచి పుట్టింటిలో ఉంటున్న యువ్వనంలో ఉన్న భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. కుటుంబ సభ్యులకు ఏదో ఒకటి చెప్పి బయటకు వెలుతున్న యువతి ఆమె ప్రియుడితో జల్సా చేసింది.
రెండు రాష్ట్రాల సరిహద్దు కావడం, పర్యాటక కేంద్రం సమీపంలో ఉండటంతో వీరి జల్సా చెయ్యడానికి మంచి చాన్స్ చిక్కింది. ఇటీవల ప్రియురాలి మీద ఆమె ప్రియుడికి అనుమానం మొదలైయ్యింది. ఇప్పటికే వివాహం చేసుకున్ని భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్న ప్రియుడికి అతని ప్రియురాలి క్యారెక్టర్ మీద దిగులు పట్టుకునింది. ఎప్పటిలాగా ఇంట్లో ప్రియురాలు వంట చేసుకుంటున్నది.
ఆ సమయంలో బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చిన ప్రియుడు కత్తి తీసుకుని అతని ప్రియురాలిని 20 సార్లు పొడిచేశాడు. అడ్డు వచ్చిన ప్రియురాలి తల్లి, తండ్రిని కూడా వదలకుండా వారిని కూడా పొడిచేశాడు. ప్రియురాలిని పొడిచిన కత్తితోనే ప్రియుడు కూడా దారుణంగా పొడుచుకోవడం కలకలం రేపింది.
Illegal affair: నా ప్రియురాలు శాడిస్టు, భర్తనే వదల్లేదు, నన్ను టార్చర్ పెట్టి కోరికలు తీర్చుకుంది!
ఇంట్లో పెళ్లి చాశారు కానీ?
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సరిహద్దులోని కేరళ రాష్ట్రం బార్డర్ లో నేదుమంగడ్ ప్రాంతంలో గాయిత్రీ (21) అనే యువతి నివాసం ఉంటున్నది. గత ఏడాదిలో కుటుంబ సభ్యులు చూపించిన యువకడిని వివాహం చేసుకున్న గాయిత్రీ అతనితో జీవితాంతం కాపురం చేసి పిల్లాపాలతో సంతోషంగా ఉండాలని అనుకుంది.
భార్య జీవితం రివర్స్
కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తినే వివాహం చేసుకున్న గాయిత్రీకి పరిస్థితులు అనుకూలించపోవడంతో దంపతులు ఆరు నెలల క్రితం విడిపోయారు. ఆరు నెలల నుంచి కన్యాకుమారి- కేరళ సరిహద్దులోని పుట్టింటిలో గాయిత్రీ నివాసం ఉంటున్నది. భర్తతో తెగతెంపులు చేసుకున్న గాయిత్రీ తల్లి వికలాంగురాలు కావడంతో తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నది.
పెళ్లి కాకముందే ప్రియుడు
కేరళ సరిహద్దులోని ఆర్యనాడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అరుణ్ (28) అనే యువకుడికి ఇంతకు ముందే వేరే యవతితో వివాహం అయ్యింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న అరుణ్ కు, గాయిత్రీకి ఆమె పెళ్లి కాకముందే పరిచయం ఉంది. పెళ్లి కాకముందే అరుణ్ తో ఎంజాయ్ చేసిన గాయిత్రీ వివాహం అయ్యే వరకు అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.
మొగుడు వదిలేసిన తరువాత మస్త్ మజా
ఆరు నెలల నుంచి పుట్టింటిలో ఉంటున్న యువ్వనంలో ఉన్న గాయిత్రీ ఆమె ప్రియుడు అరుణ్ తో ఎంజాయ్ చేస్తోంది. కుటుంబ సభ్యులకు ఏదో ఒకటి చెప్పి బయటకు వెలుతున్న గాయిత్రీ ఆమె ప్రియుడు అరుణ్ ఎంత సేపు అంటే అంతసేపు అతనితో జల్సా చేసింది. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడం, పర్యాటక కేంద్రం సమీపంలో ఉండటంతో గాయిత్రీ, అరుణ్ జల్సా చెయ్యడానికి మంచి చాన్స్ చిక్కిందని సమాచారం.
ప్రియురాలి మీద అనుమానం?
ఇప్పటికే వివాహం చేసుకున్ని భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్న ప్రియుడు అరుణ్ కు అతని ప్రియురాలు గాయిత్రీ క్యారెక్టర్ మీద దిగులు పట్టుకునింది. గాయిత్రీకి మరో ప్రియుడు ఉన్నాడని అరుణ్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో కొంతకాలం నుంచి గాయిత్రీ, అరుణ్ ల మద్య కొన్నిసార్లు గొడవలు జరిగాయని సమాచారం. మర్యాదగా నాతో కలిసి సంతోషంగా ఉంటే ఉండు, లేదంటే నా విషయంలో జోక్యం చేసుకుంటే నీ కథ చూస్తానని గాయిత్రీ ఇటీవల ఆమె ప్రియుడు అరుణ్ ను హెచ్చరించిందని తెలిసింది.
ప్రియురాలిని 20 సార్లు పొడిచిన ప్రియుడు
ఎప్పటిలాగా ఇంట్లో అరుణ్ ప్రియురాలు గాయిత్రీ వంట చేసుకుంటున్నది. ఆ సమయంలో బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చిన ప్రియుడు అరుణ్ కత్తి తీసుకుని అతని ప్రియురాలు గాయిత్రీ మీద దాడి చేశాడు. చేతిలో కత్తి పట్టుకున్న అరుణ్ ప్రియురాలు గాయిత్రీ మీద రగిలిపోయి ఆమె ముఖం, మెడ, ఛాతితో పాటు ఆమె శరీరంలో 20 సార్లు పొడిచేశాడు.
మంచం మీద ఉన్న గాయిత్రీ తల్లి అడ్డు వెళ్లడంతో ఆమెను పొడిచేశాడు. ఇదే సమయంలో ఇంటి బయట ఉన్న గాయిత్రీ తండ్రి సదాశివన్ వెళ్లి అరుణ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కసితో రగిలిపోతున్న అరుణ్ ప్రియురాలు గాయిత్రీ తండ్రి సదాశివన్ ను కూడా వదలకుండా ఆయన్ను పొడిచేశాడు.
ప్రియురాలి ప్రాణం పోయింది
గాయిత్రీ, ఆమె తండ్రి సదాశివన్ కేకలు వెయ్యడంతో స్థానికులు వారి ఇంటి దగ్గరకు పరుగు తీశారు. ప్రియురాలు గాయిత్రీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా పొడిచిన అరుణ్ అక్కడి నుంచి పారిపోయి సమీపంలోని ఫామ్ హౌస్ లో దాక్కొన్నాడు. స్థానికులు వెంటాడి అరుణ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. గాయిత్రీతో పాటు ఆమె తల్లిదండ్రులను కేరళలోని త్రివేండ్రం ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై గాయిత్రీ మరుసటి రోజు ఉదయం మరణించిందని పోలీసులు అన్నారు.
Recommended Video
పెళ్లి కాకముందే అక్రమ సంబంధం
గాయిత్రీకి వివాహం జరగక ముందు నుంచి అరుణ్ తో అక్రమ సంబంధం ఉందని, భార్య పిల్లలు ఉన్నా అరుణ్ కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, గొడవలతో వీరి మద్య తేడాలు వచ్చాయని పోలీసులు అంటున్నారు. భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్న గాయిత్రీ ఆమె ప్రియుడు అరుణ్ చేతిలో దారుణ హత్యకు గురి కావడం తమిళనాడు- కేరళ సరిహద్దులో కలకలం రేపింది.