Marriage: విదేశాల్లో ఉద్యోగం, అమ్మాయి నచ్చలేదని, పెళ్లి చెయ్యలేదని తల్లిదండ్రులను ఎలా చంపాడంటే ?!
చెన్నై/ పుదుకోటై: సంతోషంగా కాపురం చేసిన దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వ్యవసాయం చేయిస్తున్న భూస్వామి అతని ఇద్దరు కుమారులను, కూతురిని బాగా చదివించాడు. పెద్ద కొడుక్కి, కూతురికి పెళ్లి చేశారు. మరో కొడుకు విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. కొడుకు పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తున్న ఊరిలోనే నివాసం ఉంటున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకుకు పెళ్లి చెయ్యాలని అతని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.
అయితే ఎక్కడా రెండో కొడుక్కి పెళ్లి కూతురు సెట్ కాకపోవడంతో అతనికి ఇంకా పెళ్లికాలేదు. విదేశాల నుంచి వచ్చిన కొడుకు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, తరువాతే విదేశాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యి అనేక మంది అమ్మాయిలను చూశాడు. పెళ్లి కొడుక్కి అమ్మాయి నచ్చితే పెద్దలకు ఆమె నచ్చకపోవడం, పెద్దలకు నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకునే యువకుడికి నచ్చకపోవడం, ఇలా రకరకాల కారణాలతో ఆ యువకుడి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది.
తనకు పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ కొడుకు అతని తల్లిదండ్రులతో రోజూ గొడవ పడుతూనే ఉన్నాడు. తనకు పెళ్లి కాకపోవడానికి తన తల్లిదండ్రులే కారణం అంటూ సహనం కోల్పోయిన కొడుకు జన్మనిశ్చిన అమ్మానాన్నలను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకు సైలెంట్ గా అక్కడి నుంచి చెక్కేశాడు.
Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం, బ్యాంకులో భార్యను పొడిచిపారేశాడు, బంగారు నగలు!
వ్యవసాయం చేయిస్తున్న తండ్రి
తమిళనాడులోని పుదుకోటై సమీపంలోని నాటియంకడు గ్రామంలో రంగస్వామి (60), వల్లి (55) దంపతులు నివాసం ఉంటున్నారు. రంగస్వామి, వల్లి దంపతులకు గోపీనాథ్, బాలు అనే ఇద్దరు కుమారులు, సంగీత అనే కుమార్తె ఉన్నారు. వ్యవసాయం చేయిస్తున్న భూస్వామి రంగస్వామి అతని ఇద్దరు కుమారులను, కూతురిని బాగా చదివించాడు.
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు
రంగస్వామి, వల్లి దంపతులకు పెద్ద కొడుకు గోపినాథ్, కూతురు సంగీతకు పెళ్లి చేశారు. మరో కొడుకు బాలు విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. కూతురు సంగీత పెళ్లి చేసుకుని సేలంలోని ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది. పెద్ద కొడుకు గోపీనాథ్ పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తున్న సేలంలోనే అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.
ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న రంగస్వామి రెండో కొడుకు బాలుకు పెళ్లి చెయ్యాలని అతని తల్లిదండ్రులు రంగస్వామి, వల్లి అనుకుంటున్నారు. అయితే ఎక్కడా రెండో కొడుకు బాలుకు పెళ్లి కూతురు సెట్ కాకపోవడంతో అతనికి ఇంకా పెళ్లికాలేదు. విదేశాల నుంచి వచ్చిన బాలు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, తరువాతే విదేశాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాడు.
పెళ్లి కూతురు ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చదు
పెళ్లి కొడుకు బాలుకు అమ్మాయి నచ్చితే అతని పెద్దలకు ఆమె నచ్చకపోవడం, పెద్దలకు నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకునే బాలుకు నచ్చకపోవడం, ఇలా రకరకాల కారణాలతో ఆ యువకుడి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. తనకు పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ బాలు అతని తల్లిదండ్రులు రంగస్వామి, వల్లితో రోజూ గొడవ పడుతూనే ఉన్నాడు.
Recommended Video
పెళ్లి కాలేదని తల్లిదండ్రులను ఎలా చంపేశాడంటే?
తనకు పెళ్లి కాకపోవడానికి తన తల్లిదండ్రులు రంగస్వామి, వల్లి కారణం అంటూ సహనం కోల్పోయిన బాలు అతనికి జన్మనిశ్చిన అమ్మానాన్నలను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంటి సమీపంలో ఉన్న షెడ్ లో తండ్రి రంగస్వామిని గొంతుకు నులిమి చంపేసిన బాలు అతని తల్లి వల్లిని కొడవలితో నరికి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
తల్లిదండ్రులు రంగస్వామి, వల్లిని హత్య చేసిన కొడుకు సైలెంట్ గా అక్కడి నుంచి చెక్కేశాడు. బంధవులు వెళ్లి చూసిన తరువాతే రంగస్వామి, వల్లి దంపతులు హత్యకు గురైన విషయం వెలుగు చూసిందని, బాలు కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.