ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గంగాధర నెల్లూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గంగాధర నెల్లూరు, పెనుమూరు మండలాలు ఈ నియోజకవర్గంలో చేరా యి. పుత్తూరు నియోజకవర్గం నుండి ఎస్సార్ పురం, పాలసముద్రం మండలాలు, నగరి నియోజకవర్గం నుండి కార్వేటి నగరం మండలాలు వచ్చి కలిసాయి. వెదురుకుప్పం మండలం సైతం ఈ నియోజకవర్గంలో చేరింది. గతంలో ఉన్న వేపంజరి (ఎస్సీ) నియోజకవర్గం 2009 లో రద్దు అయింది. ఒక మహిళా నాయకురాలు నాలుసార్లు శాసనసభకు ఎన్నికైన అతికొద్ది నియోజకవర్గాల్లో వేపంజరి ఒకటి. ఇక్కడి నుండి మాజీ మంత్రి జి కుతూహలమ్మ నాలుగు సార్లు ఎన్నియ్యారు. 2009 లో కాంగ్రెస్ నుండి గెలిచిన కుతూహలమ్మ 2014 లో ఓడిపోయారు.
గంగాధర
నెల్లూరు
లో
రెండు
సార్లు
ఎన్నికలు..
గంగాధర
నెల్లూరు
నియోజకవర్గంలో
రెండు
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
2009
లో
జరిగిన
ఎన్నికల్లో
కాంగ్రెస్
గెలవగా..
2014
లో
వైసిపి
గెలిచింది.
ఇక,
వేపంజరి
లో
కాంగ్రెస్
ఆరు
సార్లు
గెలవగా..
టిడిపి
రెండు
సార్లు
గెలిచింది.
జనతా
పార్టీ
నుండి
ఒకసారి,
స్వతంత్ర
అభ్యర్ధి
ఒకసారి
గెలుపొందారు.
ఇక,
2009
తరువాత
ఇక్కడి
రాజకీయ
పరిణామాల్లో
వేగంగా
మార్పులు
చోటు
చేసుకున్నాయి.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
184112
ఓట్లు
ఉండగా,
అందులో155679
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
నారా
యణ
స్వామికి
84538
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
కుతూహలమ్మ
కు
63973
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ధి
నారాయణ
స్వామి
20565
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక,
వచ్చే
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
వైసిపి
అభ్యర్దిగా
సిట్టింగ్
ఎమ్మెల్యే
నారాయణ
స్వామి
తిరిగి
పోటీ
చేయటం
ఖాయంగా
కనిపిస్తోంది.
ఇక,
టిడిపి
నుండి
గత
ఎన్నికల్లో
పోటీ
చేసి
ఓడిన
కుతూహలమ్మ
కు
ఇస్తారా
లేక
మరో
అభ్యర్ధిని
రంగంలోకి
దింపుతారా
అనేది
తేలాల్సి
ఉంది.
ఇక,
2009
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
ప్రజారాజ్యం
అభ్యర్దిగా
పోటీ
చేసిన
నాగభూషణం
కు
12405
ఓట్లు
వచ్చాయి.
ఈ
సారి
జనసేన
ఇక్కడ
బరిలో
ఉంటుందా
..ఉండదా
ఉంటే
ఎవరు
పోటీలో
ఉంటారనే
క్లారిటీ
లేదు.
దీంతో..ఇక్కడ
త్రిముఖ
పోటీ
జరిగే
అవకాశం
ఉన్నా..ప్రధాన
పోటీ
మాత్రం
టిడిపి
-వైసిపి
మధ్యనే
ఉండనుంది.