ఇక మోహన్ బాబు యూనివర్సిటీ.. శ్రీ విద్యానికేతన్కు ప్రమోషన్, విలక్షణ నటుడు ట్వీట్..
విలక్షణ నటుడు మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ ఏ స్టూడెంట్ క్యాస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ చాలా మంది చేత ప్రశంసలు కురిపిస్తోంది. అందరికీ మంచి విద్యను అందిస్తున్నారు. అయితే విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. పలువురు అభినందనలు చెబుతూ.. రీ ట్వీట్ చేశారు.
25 శాతం రిజర్వేషన్
శ్రీ విద్యానికేతన్ స్థాపించి దాదాపు 25 ఏళ్లు గడిచింది. ఇక్కడ కులమతాలకు అతీతంగా 25 శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా లభించింది. ఒకరకంగా ఇదీ మోహన్ బాబు చిరకాల కోరికే అని చెప్పాల్సి ఉంటుంది. చిన్న మొక్కగా మొదలైన శ్రీ విద్యానికేతన్ కల్పవృక్షంగా మారిందని మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.
30 ఏళ్ళ మీ నమ్మకం, తన జీవితపు కృషి, ధ్యేయం ఈ రోజు నెరవేరిందని వివరించారు. విద్యాసంస్థను యూనివర్సిటీగా మార్చేసాయని.. తిరుపతిలో ఇప్పటి నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుందని చెప్పారు. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటానని మోహన్ బాబు ట్వీట్ చేశాడు.
త్రివిక్రమ్ కంగ్రాట్స్
మోహన్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కంగ్రాట్స్ చెప్పారు. మీ విద్యా సంస్థలో కుల, మతాల ప్రస్తావనే ఉండదని గుర్తుచేశారు. మిగతా నటీనటులు, అభిమానులు కూడా విషెస్ తెలియజేస్తున్నారు. హీరోగా బిజీగా ఉన్న సమయంలో నిర్మాతగా కూడా మారారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో దాదాపు 50 సినిమాలకు పైగా నిర్మించారు. ఆ తర్వాత విద్యావేత్తగా మారిపోయారు. 1993లో శ్రీ విద్యానికేతన్ స్థాపించి.. చాలా మందిని తీర్చిదిద్దారు. వారంతా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు.
మొక్కగా ప్రస్థానం
చిన్న మొక్కగా ప్రారంభమైన విద్యాసంస్థ ఇప్పుడు యూనివర్సిటీగా మారింది. శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషన్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పిజి కాలేజ్ సముదాయం ఉంది. ఇన్ని ఉన్నందున చాలా రోజుల నుంచి విద్యాసంస్థకు వర్సిటీ హోదా కోసం తీవ్రంగా ప్రయత్నించారు. శ్రీ విద్యానికేతన్ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది.