health tips: పండుగ ట్రిప్ వెళ్లొచ్చాక జలుబు, దగ్గు పట్టుకున్నాయా? ఈ చిట్కాలు మీకోసమే!!
సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లి ప్రయాణాలు చేసి వచ్చిన వారు, తిరిగి మళ్లీ ఇళ్లకు చేరుకున్న తర్వాత కొందరు జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక అటువంటి వారు జలుబు, దగ్గుల నుండి బయట పడాలంటే చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటించి వాటి నుండి ఉపశమనం పొందాలని చెప్తున్నారు. ఎన్ని చేసినా జలుబు, దగ్గు తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

జలుబు, దగ్గు తగ్గేందుకు నేచురల్ రెమిడీస్
ఇక జలుబు, దగ్గు తగ్గడం కోసం మన ఇంట్లోనే సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో రిలీఫ్ కోసం ట్రై చేయాలని చెబుతున్నారు. జలుబు, దగ్గు రాగానే యాంటీబయాటిక్స్ వాడడం ఏమాత్రం మంచిది కాదని సలహా ఇస్తున్నారు వేడినీళ్లలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలిపి తాగాలని, దీనివల్ల కాస్త జలుబు, దగ్గు నుండి ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. ఈ చిట్కా పిల్లలతో పాటు పెద్ద వాళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. మిరియాల పాలు కూడా గొంతు నొప్పి, దగ్గుల నుండి నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. మిరియాల కషాయం, లవంగాలు నోట్లో వేసుకుని వాటి రసాన్ని మింగటం,మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.

వంటింటి చిట్కాలతో దగ్గు, జలుబు నుండి బయటపడండి
ఇక ఒక చెంచాడు నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను వేడి నీళ్లలో కలుపుకొని తాగితే కూడా ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు. బాగా అల్లాన్ని దంచి టీ పెట్టుకుని, అల్లం టీ చేసుకుని తాగితే కూడా రిలీఫ్ ఉంటుందని చెబుతున్నారు. వెల్లుల్లితో కూడా జలుబు, దగ్గు తగ్గుతాయని, కొన్ని వెల్లుల్లి ముక్కలను ఆహారం తీసుకునేటప్పుడు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, జలుబు, దగ్గు నుండి ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు. జలుబు దగ్గు తగ్గడానికి తులసి, అల్లం కాంబినేషన్ కూడా అద్భుతంగా పనిచేస్తుందని, ఈ రెండు తీసుకోవడం వల్ల చాలా వేగంగా మీలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు.

జలుబు, దగ్గు ఉంటే వీటిని ఆహారంలో తీసుకోండి
ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా త్వరగా జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. కొద్దిగా పసుపు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్ చేయడం వల్ల గొంతుకు ఉపశమనం దొరుకుతుందని సూచిస్తున్నారు. తులసి ఆకులను కాసేపు నీళ్లలో మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇక త్రాగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. జలుబు బాగా వేధిస్తుంటే ఆవిరి తీసుకోవడం మంచిదని అంటున్నారు.

అన్నిటికంటే దగ్గు, జలుబుకు అద్భుతంగా పని చేసే కషాయం ఇదే
కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీ స్పూన్ వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే మరింత మంచి ఫలితం ఉంటుందని, త్వరగా దగ్గు, జలుబు నుండి ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. ఇక ఇంతా చేసినా దగ్గు, జలుబు నుండి ఉపశమనం రాలేదంటే వైద్యున్ని సంప్రదించి మందులు వాడాల్సిందిగా సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications