నీలి చిత్రాలే వ్యసనం : బాలికలకు చూపిస్తూ దొరికిపోయాడు
గుంటూరు: జిల్లాలోని తెనాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడు.. పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. దీంతో ఆ బాలిక భయంతో తల్లి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు నిందితుడికి దేశశుద్ధి చేశారు.

వదిలేసిన భార్య..
తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పసుపులేటి దుర్గా ప్రసాద్కు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు కలగకపోవడం, అతని వేధింపులు కారణంగా భార్య వదిలేసి వెళ్లిపోయింది.

వ్యసనంగా నీలిచిత్రాలు
వెదురు బొంగుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న అతడు.. తరచూ తన మొబైల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తేండేవాడు. దీంతో అతనికి అవి వ్యసనంగా మారిపోయాయి. అతను చూడటమే కాకుండా.. ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఆ వీడియోలను చూపించేవాడు.

భయంతో చిన్నారి..
గతంలో కూడా ఓ బాలిక తనకు నీలి చిత్రాలు చూపించిన విషయం తన కుటుంబసభ్యులకు తెలపడంతో అతన్ని చితకబాది వదిలేశారు. తాజాగా, మరో పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. కాగా, ఆ చిన్నారి భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లితో ఈ విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు దుర్గా ప్రసాద్కు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు.

వివాహితపై దారుణం..
ఇది ఇలావుంటే, నెల్లూరు జిల్లాలో కొందరు మృగాళ్లు దారుణానికి తెగబడ్డారు. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి శుక్రవారం రాత్రి సమీప గ్రామానికి వెళ్లింది. అక్కడ భర్త మద్యం తాగి ఆమెతో గొడవపడ్డాడు. మనస్తాపంతో ఆ మహిళ తిరిగి స్వగ్రామానికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో పక్క గ్రామానికి చెందిన కురుగొండ్ల నరసయ్య, సక్కిరాల రవి, బండ్ల కామక్షయ్య బైక్పై వచ్చి ఆమెను అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయారు. శనివారం నిందితులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications