మరో టీడీపీ నాయకుడిపై దాడి ..జగన్ కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేని అసమర్ధులా .. లోకేష్ ఫైర్
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడులే కాదు , శారీరక దాడులు సైతం పెరిగిపోయాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నాయి . గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆగటం లేదు . టీడీపీ కార్యకర్తలపై దాడులపై టీడీపీ మండిపడుతున్నా అధికార పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఏపీలో కొనసాగుతున్న దాడులు .. సీఎం జగన్ పై టీడీపీ నాయకుల ఆగ్రహం
ఒకపక్క చంద్రబాబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన , గాయాలపాలైన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు యాత్ర చేపట్టారు. ఒకపక్క రాష్ట్ర వ్యాప్తంగా దాడులపై ఆందోళన వ్యక్తమవుతున్నా ఇంత మంది చనిపోతున్నా ఏపీ సీఎం జగన్ మాత్రం దాడుల మీద ఇప్పటి వరకు స్పందించలేదు . పార్టీ శ్రేణులకు సంయమనం తో ఉండమని చెప్పలేదు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్లకూరు గ్రామ సర్పంచ్ అడ్డాల శివరామరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు.

ఫ్లెక్సీ ల గొడవలో టీడీపీ సర్పంచ్ పై ఇనుప రాడ్ తో దాడి .. తీవ్ర గాయాలు
మండలంలోని కాళ్ళకూరులో టీడీపీ , వైసీపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ రగడ నెలకొంది . ఫ్లెక్సీ తొలగింపు వివాదంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాళ్ళకూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మండల సర్పంచ్ల ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అడ్డాల శివరామరాజు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన ఉన్న స్తంభాలకు గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ కట్టించారు. మంగళవారం ఉదయం వైసీపీ నాయకుడు గాదిరాజు గోపాలరాజు ఫ్లెక్సీని తొలగిస్తుండగా శివరామరాజు ప్రశ్నించారు. దీనితో గోపాలరాజు చేతిలో ఉన్న ఇనపరాడ్తో శివరామరాజు తల పై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన శివరామరాజు ప్రస్తుతం భీమవరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేని అసమర్థతతో ఉన్నారా జగన్ అని నిలదీస్తున్న నారా లోకేష్
సర్పంచ్, టీడీపీ నేత అయిన శివరామరాజు మీద జరిగిన దాడి జగన్ కు కనిపించటం లేదా ? అని మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ దాడులను ఖండించడానికి సీఎం జగన్ కు మనసు రావడం లేదా? అని నిలదీశారు . సీఎం జగన్ తమ కార్యకర్తలను అదుపు చేయలేని అసమర్థతతో ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్ . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనీ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో లోకేశ్ పోస్ట్ పెట్టారు. దాడికి గురైన శివరామరాజు ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు లోకేష్ .
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications