ఏపీ సీఎం జగన్కు వ్యాక్సిన్: ఎప్పుడు, ఎక్కడ అంటే...?
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తి లేని వారు చనిపోతున్నారు కూడా. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లాక్ డౌన్ లేకున్నా.. విధిగా మాస్క్ ధరించాలని కోరుతున్నాయి. భౌతికదూరం పాటించాలని స్పష్టం చేస్తున్నాయి. 45 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ కూడా అందజేస్తున్నారు. దీంతో ప్రముఖులు కూడా వ్యాక్సిన్ తీసుకుంటూ.. మిగతావారికి మరింత అవగాహన కల్పిస్తున్నారు.
ఇటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఏప్రిల్ 1న గుంటూరులో జిల్లాలో ఆయన వ్యాక్సిన్ తీసుకుంటారు. భారత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తారు. తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మేయర్ మనోహర్, ఎమ్మెల్యే మద్దాలగిరి, జిల్లా అధికారులు సమీక్షించారు.

కరోనా వైరస్ నియంత్రణ కోసం అన్ని చర్యలు చేపట్టామని ఎంపీ మోపిదేవి వెంకట రమణ తెలిపారు. వ్యాక్సినేషన్కు సంబంధించి ఆర్థిక భారం పడుతున్నా.. ముందున్నామని వివరించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు. ఏప్రిల్ 1నుంచి సచివాలయాల్లో అందుబాటులో తెస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1న సీఎం జగన్ వ్యాక్సిన్ తీసుకుంటారని.. దీంతో ప్రజల్లో ఉన్న కాసిన్ని అపోహలు తొలగిపోతాయని చెప్పారు. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలంతా పాటించాలి మోపిదేవి అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications