నారా లోకేష్ కాగాడాల ప్రదర్శన... మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు

ఏపీలో మూడు రాజధానుల వివాదం మరింత ముదురుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా టీడీపీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. కాగా ఈ ప్రదర్శనలో రైతులత పాటు టీడీపీ నేత నారా లోకేష్ పాల్గోన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు పలు నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ... ర్యాలీ కొనసాగించారు.

గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణానికి మద్దతు తెలిపారని, వైసీపీ అధికారంలోకి వస్తే... అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పారని... అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ సీఎం తీసుకున్నారని లోకేష్ ఈ సంధర్బంగా అన్నారు. మాట తప్పనని చెప్పిన సీఎం జగన్ మడమ తిప్పారని విమర్శించారు. కాగా రాజధానిని మూడు ముక్కలుగా చేస్తే అభివృద్ది ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. కాగా కాగాడాల ర్యాలీలో రైతులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Farmers have staged protests against the ap government

కాగా ఉదయం నుండి నారా లోకేష్ సీఎం జగన్‌పై ట్విట్టర్ దాడి కొనసాగించారు. ప్రభుత్వ పాలనతో ప్రజలను సంతృప్తిపరచలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మూడు , ముప్పై రాజధానులంటూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. అసలు సీఎంకు అభివృద్ది అంటే ఎమిటో తెలియదని అన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై తాము హైకోర్టు జడ్జితో విచారణకు సైతం సిద్దమని సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+