ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు: గుంటూరులో కలకలం: టీడీపీ అనుమానాలన్నీ ప్రతిపక్ష పార్టీ పైనే
గుంటూరు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం చెలరేగింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరులోని స్థంభాల గరువు, నెహ్రూనగర్, ఏటుకూరు రోడ్డుల్లో ఎన్టీ రామారావు విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి వాటికి నిప్పుపెట్టారు. సోమవారం ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు.

ఈ సమాచారం తెలిసిన వెంటనే గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహాల వద్దకు చేరుకున్నారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఇది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల పనేనంటూ కొందరు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి అరండళ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించిన సందర్భంగా వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications