టీడీపీ కష్టాన్ని వైసీపీ ఖాతాలో వేసుకుంటారా ? పోలవరం ప్రాజెక్ట్ పై లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలవరం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతా తామే చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని అలా చెప్పుకోవడం తగ్గించాలని ఆయన మండిపడ్డారు . తెలుగుదేశం హయాంలో ప్రతిపాదించిన రూ.55,548 కోట్ల సవరించిన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించిందని లోకేశ్ గుర్తుచేశారు.

 టిడిపి ప్రభుత్వం సాధించిన విజయాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే యత్నం అన్న లోకేష్

టిడిపి ప్రభుత్వం సాధించిన విజయాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే యత్నం అన్న లోకేష్

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆమోదం లభించడంపై టిడిపి ప్రభుత్వం సాధించిన విజయాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం ఒక ట్వీట్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పోలవరం డిపిఆర్ -2 కు అనుమతి పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసి రూ .55 వేల కోట్ల నిధులకు డీపీఆర్ ఇస్తే ఇప్పుడు అది ఆమోదం పొందింది . ఇప్పుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిని తమ గొప్పతనాన్ని పేర్కొంటుందని ఆయన ఆరోపించారు. ఇక చంద్రబాబు నాయుడు పంపిన అన్ని ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందున, అందులో అవినీతి ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు .

పోలవరంలో అవినీహి లేదని తేలింది కదా .. ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టండన్న లోకేష్

పోలవరంలో అవినీహి లేదని తేలింది కదా .. ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టండన్న లోకేష్

ఇక అవినీతి, అవినీతి అని గొంతు చించుకోవటం మానేసి పోలవరం ప్రాజెక్ట్ మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయటంపై దృష్టిపెడితే మంచిదని లోకేశ్ సూచించారు. ఇక్కడ నుండి, బిజెపి మరియు వైయస్ఆర్సిపి రెండూ టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బురద జల్లడం మానేసి, రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం పనిచేయడం ప్రారంభించాలని ఆయన సలహా ఇచ్చారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని ఇప్పుడు చెప్పుకుని తమ గొప్పతనమని వైసీపీ నేతలు డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని లోకేష్ మండిపడ్డారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజల కోసం చంద్రబాబు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్ట్‌ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

పోలవరం పై కేంద్రానికి పంపిన డీపీఆర్ .. టీడీపీ హయాంలోనిది .. మీ గొప్పలు ఆపండి అన్న లోకేష్

పోలవరం పై కేంద్రానికి పంపిన డీపీఆర్ .. టీడీపీ హయాంలోనిది .. మీ గొప్పలు ఆపండి అన్న లోకేష్

ఆంధ్ర ప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది . పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 55 548.87 కోట్ల సవరించిన ఒప్పందాలకు కేంద్ర జల శక్తి వనరుల శాఖ ఆమోదం తెలిపింది. పోలవరం కుడి ప్రధాన కాలువ కు 4202.69 కోట్లు, హెడ్ వర్క్స్ కు 973 4.34 కోట్లు , హౌస్ పనులకు 4124.64 కోట్లు ,పునరావసం ,పునర్నిర్మాణ పనులకు 33,168.23 కోట్ల రూపాయల అంచనా ఖర్చులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
అయితే ఇదంతా చంద్రబాబు హయాంలో, టీడీపీ పాలన సమయంలో పంపించిన డి పి ఆర్ అని, దానికి కేంద్రం ఆమోదం తెలిపితే ఇదంతా తమ క్రెడిట్ వైసీపీ చెప్పుకుంటోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+