బాలకృష్ణకు జగన్ సర్కార్ షాక్ .. హిందూపురంలో మెడికల్ కాలేజ్ లేనట్టే.. పెనుగొండలోనే ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చింది. గతంలో హిందూపురంలో మంజూరైన మెడికల్ కాలేజీని రద్దు చేసి, మెడికల్ కాలేజీని పెనుగొండ నియోజకవర్గానికి తరలించి టిడిపి నేత బాలకృష్ణకు పెద్ద ఝలక్ ఇచ్చింది. హిందూపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా సేకరించి, సిద్ధం చేసినప్పటికీ బాలయ్య నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నో అంది ఏపీ సర్కార్.
టీడీపీ హయాంలో హిందూపురం మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు అనుమతి
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హిందూపురం పార్లమెంటు పరిధిలో మాత్రం మెడికల్ కళాశాల ఏర్పాటు పై వివాదం నెలకొంది. హిందూపురంలో మెడికల్ కాలేజీ వివాదం తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరాటానికి వేదికగా మారింది. హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి గత టీడీపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ములుగూరు వద్ద మెడికల్ కళాశాల కోసం స్థల సేకరణ కూడా జరిగింది.
స్థల సేకరణ కూడా చేసినా పెనుగొండలో ఏర్పాటుపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్
ములుగూరు
లో
మెడికల్
కళాశాల
నిర్మాణం
కోసం
ఎమ్మెల్యే
బాలకృష్ణ
గత
ఎన్నికల
తర్వాత
అధికారంలోకి
వచ్చిన
వైసీపీ
ప్రభుత్వానికి
పలుమార్లు
లేఖలు
సైతం
రాశారు.
హిందూపురం
నియోజకవర్గంలో
అన్ని
వసతులతో
కూడిన
ప్రభుత్వాస్పత్రి
ఉందని,
మెడికల్
కాలేజీ
ఏర్పాటు
చేయాలని
గతంలో
మెడికల్
కాలేజ్
నిర్మాణానికి
ప్రభుత్వం
అనుమతి
ఇచ్చిందన్న
విషయాన్ని
ఆ
లేఖలలో
పేర్కొన్నారు.
ఇక ఆందోళనలతో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది టిడిపి . ఒక టిడిపి మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా హిందూపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం పట్టుబట్టాయి.
ఫలించిన మంత్రి శంకర్ నారాయణ ప్రయత్నాలు .. పెనుగొండ సమీపంలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
స్థలాన్ని కూడా సేకరించిన తరువాత కళాశాలను ఏర్పాటు చేయకుండా ఇతర నియోజకవర్గాలకు తరలించటం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక హిందూపురం మెడికల్ కళాశాల విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే జిల్లాల పునర్విభజన కమిటీ సూచనల మేరకు మెడికల్ కళాశాలను పెనుగొండలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి శంకర్ నారాయణ పట్టుబట్టారు. ఫైనల్ గా మంత్రి ప్రయత్నాలు ఫలించడం పెనుగొండ సమీపంలోని మడకశిర రోడ్డులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
59 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గా, 475 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సర్కార్
59
ఎకరాల్లో
సూపర్
స్పెషాలిటీ
ఆస్పత్రి
గా
మెడికల్
కళాశాల
నిర్మాణానికి
అంగీకరించింది.
దాని
కోసం
475
కోట్ల
రూపాయల
నిధులను
సైతం
విడుదల
చేసింది.
త్వరలో
పెనుగొండ
జిల్లా
ప్రధాన
కేంద్రం
కాబోతుందని
,పెనుగొండలో
మెడికల్
కళాశాల
ఏర్పాటుకు
గల
కారణాన్ని
మంత్రి
శంకర్
నారాయణ
సమర్థించారు
.
ఏది
ఏమైనా
హిందూపురం
నియోజకవర్గంలో
ఏర్పాటు
కావలసిన
మెడికల్
కాలేజీని,
పెనుగొండ
నియోజకవర్గానికి
తరలించి
బాలయ్యకు
బిగ్
షాక్
ఇచ్చారు.
తన
నియోజకవర్గంలో
మెడికల్
కాలేజ్
ఏర్పాటు
అవుతుంది
అన్న
బాలయ్య
ఆశలపై
నీళ్లు
చల్లారు.