యాదీ అంకుల్తో వెళ్లిన యువతీ.. 10 రోజులైనా తెలియని ఆచూకీ.. పేరంట్స్ ఆందోళన
ఓ యువతి ఆంకుల్తో వెళ్తోన్న అని లెటర్ రాసి పెట్టిపోయింది. కానీ ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు. 10 రోజులు అవుతున్నా.. ఉలుకు పలుకు లేదు. దీంతో పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ జాడ తెలియకపోవడంతో భయపడుతున్నారు. స్థానికంగా కూడా ఈ ఘటన సంచలనం రేపింది.
హైదరాబాద్ శివారు కుంట్లూర్ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ గ్రామానికి చెందిన రియల్ వ్యాపారి యాదీ వెంట వెళుతున్నట్లు ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వెళ్లింది. బాలిక కుటుంబ సభ్యులు ఆ రోజే హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుంట్లూర్లో ఉండే బాలిక హయత్నగర్లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన పీ యాదయ్య కారులో ఎక్కి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతవరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో భయం వేస్తోందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఆచూకీ కోసం ప్రత్యేక సిబ్బందిని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు సీఐ సురేందర్ తెలిపారు.