తెలంగాణలో కరోనా తగ్గుముఖం: 512 కేసులు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వెయ్యి లోపే కేసులు రావడం ఊరట కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తక్కువగా రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో 512 కేసులు వచ్చాయి. కరోనా సోకిన ఒక్కరు మృతి చెందారు. దీంతో కరోనాతో చనిపోయిన మొత్తం 4 వేల 108 మంది చేరారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 125 కొత్తగా కరోనా కేసులు వచ్చాయి. 24 గంటల్లో 1, 217 మంది కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7 లక్షల 73 వేల 362గా ఉంది. ఇక జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 13. భద్రాద్రి కొత్తగూడెం 11. జీహెచ్ఎంసీ 125. జగిత్యాల 12. జనగామ 16. జయశంకర్ భూపాలపల్లి 2. జోగులాంబ గద్వాల 2. కామారెడ్డి 3. కరీంనగర్ 17. ఖమ్మం 25. కొమరం భీం ఆసిఫాబాద్ 3. మహబూబ్ నగర్ 22. మహబూబాబాద్ 14. మంచిర్యాల 17. మెదక్ 3. మేడ్చల్ మల్కాజ్ గిరి 39. ములుగు 04. నాగర్ కర్నూలు 1. నల్గొండ 28. నారాయణపేట 3. నిర్మల్ 3. నిజామాబాద్ 17. పెద్దపల్లి 7. రాజన్న సిరిసిల్ల 10. రంగారెడ్డి 35. సంగారెడ్డి 14. సిద్దిపేట 14. సూర్యాపేట 9. వికారాబాద్ 7. వనపర్తి 6. వరంగల్ రూరల్ 5. వరంగల్ అర్బన్ 19. యాదాద్రి భువనగిరి 6 వచ్చాయి.

ఇటు దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది. ఇప్పుడు కేసులు మాత్రం భారీగా తగ్గుతున్నాయి.












Click it and Unblock the Notifications