హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కలవరం.. తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 500 లోపు వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుున్నాయి. గత 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 765 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా హైదరాబాదులో 356 కొత్త కేసులు వచ్చా. నల్గొండ జిల్లాలో 58, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, ఖమ్మం జిల్లాలో 34 కొత్త కేసులు వెలుగుచూశాయి.

765 people are infected coronavirus at telangana

648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,12,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,03,661 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 4,609 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.

కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పుడు అంతా సజావుగా ఉంది అనుకునే లోపు కొత్త వైరస్.. వేరియంట్లు వస్తున్నాయి. జనాలను ఎప్పుడూ ఏదో ఒక భయం పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీరియస్ నెస్ ఎక్కువగా లేకున్నా.. టెన్షన్ మాత్రం తప్పడం లేదు. ఈ సారి వర్షకాలంలో.. సీజనల్ వ్యాధులతోపాటు కేసులు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి.

English summary
765 people are infected coronavirus at telangana state. no deaths are found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X