Apollo Hospital Chairman: అపోలో ఛైర్మన్ విమానాన్ని డ్యామేజ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు..
అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్కు చెందిన విమానాన్ని ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేశారని అపోలో హాస్పిటల్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జగ్జీత్ సింగ్ గురువారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటీ-పీసీఆర్గా నమోదైన విమానం 2024 ఏప్రిల్ 5 వరకు బేగంపేట విమానాశ్రయంలో పార్క్ చేశారు. ఈ సమయంలో ఆసుపత్రి భద్రతా బృందం విమానంలోని కొన్ని భాగాలకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించినట్లు గుర్తించింది.
దెబ్బతిన్న వస్తువులు కనీస సామగ్రి జాబితా (MEL) అవసరాల కిందకి వచ్చినప్పటికీ, విమానం టేకాఫ్కు అనుమతించారు. విమానాన్ని చెన్నైకి కూడా తరలించారు.చెన్నై చేరుకున్న తర్వాత, విమానం ఇంజిన్, ఏవియానిక్స్కు కూడా నష్టం వాటిల్లినట్లు గుర్తించినట్లు జగ్జీత్ సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్ డైరెక్టర్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారిని నంచి సరైన సహాయం అందించలేదని జగ్జీత్ పేర్కొంది.

విమానాశ్రయ అధికారులు స్పందించకపోవడంతో జగ్జీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిట్లు తెలుస్తోంది. విమానం పార్క్ చేసిన ప్రాంతం సీసీటీవీ నిఘాలో ఉందని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని జగ్జీత్ సింగ్ పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), సెక్షన్ 427 (నష్టం కలిగించే అల్లర్లు) కింద కేసు నమోదు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
ఈ విషయంపై బేగంపేట్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. కొంత ప్రముఖులకు సొంతంగా విమానాలు ఉంటాయి. వీటిని ఎయిర్ పోర్టుల్లో పార్క్ చేస్తారు. దానికి గానూ పార్కింగ్ ఫీజు కూడా చెల్లిస్తుంటారు. టాలీవుడ్ సినీ ప్రముఖులకు కూడా విమానాలు ఉన్నాయి. వీటిని కూడా విమానాశ్రయంలో పార్కింగ్ చేస్తారు.












Click it and Unblock the Notifications