హైదరాబాద్లో ఘోరం: మద్యం తాగించి బాలికపై గ్యాంగ్రేప్, కేకలు వినబడకుండా మ్యూజిక్
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు కొందరు యువకులు మద్యం తాగించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: మహిళలు, యువతులు, బాలికలపై లైంగిక దాడులను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిపై అఘాత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు కొందరు యువకులు మద్యం తాగించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణకు ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ బాలిక ఫిబ్రవరి 4వ తేదీన మందులు కొనుగోలు చేసేందుకు తనకు తెలిసిన హోల్ సేల్ ఔషధాలు విక్రయించే దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడేవున్న ముగ్గురు యువకులు తక్కువ ధరకు మందులు ఇప్పిస్తామని నమ్మించి.. బాలికను కందికల్ లోని బోయిగూడలో ఓ ఇంటికి తీసుకెళ్లారు.

ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ బాలికతో బలవంతంగా హుక్కా తాగించారు. ఆ తర్వాత కాసేపటికి కూల్డ్రింక్లో మద్యం కలిపి బాలికకు తాగించారు. ఆ తర్వాత ఆమెతో యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసింది. దీంతో బాధితురాలి అరుపులు బయటకు వినపడకుండా మ్యూజిక్ సిస్టంలో సౌండ్ పెంచారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. బాలికపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక మత్తులో జారుకోగానే.. ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
మెలుకువ రాగానే వారి నుంచి తప్పించుకున్న బాలిక.. ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని ఏడ్చుకుంటూ తన తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఇచ్చిన వివరాలతో నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
చివరికు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. వారిలో ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు వారికి సహకరించినట్లు చెప్పారు. ఐదుగురు నిందితులను పోలీసులు రిమాండ్కు పంపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications