Srikanth: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్..
సినీ నటుడు శ్రీకాంత్, ఆయన భార్య ఊహ విడాకులు తీకుంటున్నారని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ మరి ఎక్కవ కావడంతో శ్రీకాంత్ స్పందించాడు. విడాకుల విషయాన్ని ఖండించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు ఫేస్ న్యూస్ సర్క్యూలేట్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రూమర్స్ ఎవరు పుట్టిస్తున్నారో తెలియదని.. ప్రెస్ నోట్ విడుదల చేశారు.

చనిపోయినట్లుగా
గతంలో తను చనిపోయినట్లుగా రూమర్స్ వచ్చాయని చెప్పారు. ఈ పుకార్లతో తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని అన్నారు. కొన్ని వెబ్సైట్స్లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించిందని శ్రీకాంత్ ప్రెస్ నోట్ లో తెలిపారు.

సోషల్ మీడియా
ఇలాంటివి ఏమాత్రం నమ్మోద్దు. ఆందోళన పడోద్దు అని తనను ఓదార్చానని చెప్పారు . అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తను, ఊహ నిన్న చెన్నై వచ్చి వచ్చామని ఇక్కడి నుంచి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నామన్నారు.

సైబర్ క్రైమ్
ఇలాంటి రూమర్స్ తమ కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుందన్నారు. ఈ రూమర్ ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నామన్నారు. తన మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications