కేసీఆర్ కు చెక్ పెట్టే వ్యూహంలో అమిత్ షా .. ఎలా స్కెచ్ వేశారో తెలుసా !
Recommended Video
2023 టార్గెట్ గా తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పావులు కదుపుతోందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించిందా అంటే అవును అనే అనే చెప్తున్నారు తెలంగాణా బీజేపీ నాయకులు . ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిహ్ షా కూడా పక్కా స్కెచ్ తో తెలంగాణలో పాగా వెయ్యటానికి ఇప్పటి నుండే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ బలోపేతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ అమలులో ఉంది .

తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ మాస్టర్ ప్లాన్
తెలంగాణాపై ఫోకస్ పెట్టింది బీజేపీ. లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అధినాయకత్వానికి తెలంగాణాపై దృష్టి పెట్టేలా చేశాయి. మరోపక్క కాంగ్రెస్ బలహీనం కావటం కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆటోమేటిక్ గా బలమైన క్యాడర్ అనేది పార్టీకి ఏర్పాటు అవుతుంది. ఒక్కసారి బలమైన క్యాడర్ వస్తే చాలు, రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ విజయబావుటా ఎలా ఎగరవేయాలో కమలనాథులకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఇతర పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. త్వరలో పెద్ద ఎత్తున పార్టీలోకి వలసలు ఉంటాయని కమలనాధులు చెప్తున్నారు.

తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ చిన్న అంశం దొరికినా వదలొద్దని చెప్పిన అమిత్ షా
ఇక పార్టీ కోసం బలంగా పని చేసే నాయకులు ఎంత ముఖ్యమో ప్రజా క్షేత్రంలోకి బలంగా వెళ్ళటం కూడా అంతే ముఖ్యం , కేవలం వలసల వలన పార్టీ ఇమేజ్ పెరగదని బీజేపీ అధినాయకులకి తెలుసు, అందుకే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలు చేయాలనీ అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకి దిశానిర్దేశం చేస్తున్నాడు. తాజాగా ఢీల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో రాష్ట్ర బీజేపీ నేతలతో హోమ్ మంత్రి అమిత్ షా చర్చలు సాగించాడు. కేసీఆర్ పరిపాలనలో జరుగుతున్నా అక్రమాల గురించి, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయండి అని పిలుపునిచ్చారు . ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ ఒక్క చిన్న అంశం దొరికిన వదలవద్దని ఆయన సూచించారు . మన పార్టీలో బలమైన నేతలను గుర్తించి వాళ్ళకి తగిన బాధ్యతలు అప్పగించండి.మన లక్ష్యం వచ్చే ఎన్నికల్లో తెలంగాణాల్ పాగా వెయ్యటం అని స్పష్టంగా సూచించారు.

తెలంగాణలో కేంద్రమంత్రులు ఎప్పటికీ పర్యటించే ప్లాన్ .. కేసీఆర్ టార్గెట్ గా పని చెయ్యాలని సూచన
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నుండి ప్రతి పదిహేను రోజులకి ఒక కేంద్రమంత్రి పర్యటించేలా పక్క ప్రణాళిక సిద్ధం చేద్దామని చెప్పారు . కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టి ప్రజలకి మనం దగ్గర అవ్వటానికి ఉన్న అన్ని మార్గాల్లో మనం ప్రయాణించాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారు . వచ్చే ఏడాది కాలంలో దాదాపు 52 మంది కేంద్ర మంత్రులు తెలంగాణ విజిట్ చేసేలా చేద్దామని, ప్రజల మద్దతు కూడగట్టటం ఇప్పటి నుండే యుద్ధ ప్రాతిపదికన జరగాలని ఆయన తెలిపారు. అలాగే ఈ సారి పార్టీ సభ్యత్వ నమోదు కూడా భారీగా జరగాలని కేంద్ర బీజేపీ పెద్దలు సృష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. రాబోవు రోజుల్లో కేసీఆర్ కి చెక్ పెట్టటానికి బీజేపీ భారీ ప్రణాళికనే సిద్ధం చేసింది. బీజేపీ అగ్ర నాయకత్వం రంగంలోకి దిగి ఇప్పటి నుండే ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తే భవిష్యత్ లో బీజేపీ పుంజుకోవటం ఖాయంగా కనిపిస్తుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications