గవర్నర్ దత్తాత్రేయకు అస్వస్థత: అపోలో ఆస్పత్రిలో చేరిక
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అనారోగ్యానికి గురయ్యారు. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ వెళ్లనున్న ఆయన సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదర్గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరికాసేపట్లో అపోలో డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెత్త్ బులిటెన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా..రెండు సార్లు సేవలందించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయనకి రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

తెలంగాణా బీజేపీ నాయకుడయిన బండారు దత్తాత్రేయ చాలా సంవత్సరాలుగా బీజేపీలో కీలక భూమిక పోషించారు. ఇక తాజాగా ఆయనను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించింది కేంద్ర సర్కార్ .హైదరాబాద్ లో ఆయన సొంత నివాసం ఉండటంతో అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు.
Recommended Video

ఉమ్మడి ఏపీలోనూ, విభజన తర్వాత తెలంగాణాలోనూ బండారు దత్తాత్రేయ బీజేపీ సీనియర్ నాయకుడిగా కీలకంగా వ్యవహరించారు. బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. ఇక బండారు దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ నేతలు అడిగి తెలుసుకుంటున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications