అప్పుడు విమోచన..ఇప్పుడు సమైక్యతానా, కేసీఆర్పై రాములమ్మ ఫైర్, వీహెచ్ ఇలా
విమోచన దినోత్సవ వేళ నేతల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది.నిరంకుశ నిజాం పాలనపై కొట్లాడి 75 ఏళ్ల కింద హైదరాబాద్ సంస్థానాన్ని విడిపించుకున్నాం అని పైర్ బ్రాండ్ విజయశాంతి అన్నారు. ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో జరిగిన ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజలు బానిస జీవితాల నుంచి విముక్తి కలిగిందన్నారు.
ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యతా దినం అంటున్నారని విజయశాంతి అన్నారు. నిజాం రాజ్యంలో భాగమై ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో కొన్ని ప్రాంతాల వారు సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినంగానే పాటిస్తున్నారు. కవల పార్టీ ఎంఐఎం భయంతో ఆ తేదీని తల్చుకోవడానికే వణికిపోయిన టీఆర్ఎస్ అధినేత, ఇప్పుడు కిందా మీదా పడి దీనికి సమైక్యతా దినం అని కొత్తపేరు పెట్టారని మండిపడ్డారు.

నిజాం సమాధికి వంగి నమస్కారం పెట్టిన కేసీఆర్... సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా వర్ణించడం వెనుక ఊహించని...వారికి నచ్చని ఒక సత్యం కనిపిస్తోంది. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ ఆసేతు హిమాచలాన్నీ ఏకతాటిపై నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టింది కూడా ఇదే రోజున అని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ విమోచన అని, ఇప్పుడేమో సమైక్యత అంటున్నాడని వీహెచ్ ఫైరయ్యారు. బీజేపీ పాత్ర అసలు ఉద్యమంలో లేనే లేదని.. అమిత్ షా మాత్రం గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. సాయుధ పోరాటం తానే చేసినట్లు అమిత్ షా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications